గుండెపోటు ఒకప్పుడు 60 ఏళ్లు పైబడితే వచ్చేది. ఇప్పుడు పాతిక, 30 ఏళ్ల వయసున్న వారికి కూడా వచ్చేస్తుంది. తినే ఫుడ్డు మారింది. పడుకునే బెడ్ సమయం మారింది. అన్నీ మారిపోయాయి. మారుతున్న కాలాన్ని బట్టి గుండెపోటు కూడా తన నిర్ణయాన్ని మార్చుకుందో ఏమో తొమ్మిదేళ్ల చిన్నారి గుండెను ఎత్తుకెళ్లిపోయింది. అప్పటి వరకూ ఎంతో సరదాగా ఆడుతూ, పాడుతూ తిరిగే తొమ్మిదేళ్ల కుర్రాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. చిన్న పిల్లాడు ఇలా అకస్మాత్తుగా మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చోటు చేసుకుంది.
వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బుర్ర కౌశిక్ గౌడ్.. అనే తొమ్మిదేళ్ల బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు. దీపావళి సందర్భంగా స్కూల్ కి సెలవు కావడంతో నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా దీపావళి పండుగని జరుపుకున్నాడు. రాత్రి చాలా సేపు దీపావళి టపాసులు పేల్చి ఆ తర్వాత నిద్రపోయాడు. ఉదయం లేచి పాఠశాలకు వెళ్ళాడు. అప్పుడు కూడా హుషారుగానే ఉన్నాడు. ఉదయం అన్ని పీరియడ్స్ లో పాఠాలు విన్న కౌశిక్.. మధ్యాహ్నం భోజనం కోసం స్నేహితులతో పాటు క్యాంటీన్ దగ్గరకు వచ్చాడు. అందరిలానే చేతిలో ప్లేటు పట్టుకుని క్యూ లైన్ లో నిలబడ్డాడు.
మరి ఏమైందో ఏమో ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు టీచర్లకు సమాచారం ఇవ్వడంతో కౌశిక్ ను గ్రామ వైద్యుడి దగ్గరకి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ కుర్రాడిని కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించగా.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో కౌశిక్ తల్లిదండ్రులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇంత చిన్న వయసులో గుండె ఆగిపోవడం ఏమిటి భగవంతుడా అని రోదించారు. చిన్నారి బాలుడు మృతితో కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, టీచర్లు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
very sad 😭https://t.co/f7dKCxKAC6
— Indian Social Media (@NagarjunaWriter) October 25, 2022