ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ రంగంలో దూసుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే.. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా సెల్ ఫోన్ ప్రతిఒక్కరికీ ఎంతో ఉపయోగపడుతుంది. వీటికి సంబంధించి నెట్ వర్క్స్ కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. 2013 లో టెలిగ్రామ్ ప్రారంభం అయ్యింది.. తొమ్మిదేళ్లలో వినియోగదారులకు ఉచితసేవలందించింది. టెలిగ్రామ్ లో అధునాతనమైన ఫీచర్స్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా టెలిగ్రామ్ యూజర్స్ ని ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంది.. కొత్త కొత్త అప్ డేట్స్ ఇస్తుంది. ప్రస్తుతం ప్రీమియం తీసుకున్న యూజర్లతో పాటుగా గతంలో టెలిగ్రామ్ తో కంటిన్యూ గా వస్తున్న స్టాండర్డ్ యూజర్ల కొరకు సరికొత్త ఫీచర్ తీసుకువస్తుంది. టెలీగ్రామ్ లో ఇప్పటి వరకు ఉన్న ఫీచర్లతో పాటుగా వాయిస్ టూ టెక్స్ట్స్ ఫీచర్ ని తీసుకు వచ్చింది. అయితే ఈ ఫీచర్ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని.. ఎవరికైనా ఈజీగా వాయిస్ మెసేజ్ మాత్రమే కాదు.. ఆ మెసేజ్ టెక్స్ట్ రూపంలో కూడా పంపించవొచ్చు. ఈ ఫీచర్ ని ఏ విధంగా పనిచేస్తాయంటే.