ప్రపంచవ్యాప్తంగా క్రాఫ్టన్ కంపెనీ తెచ్చిన పబ్ జీ గేమ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఆ గేమ్ వల్ల ఆత్మహత్యలు, హత్యలు కూడా జరిగాయి. భారతదేశంలో ఈ గేమ్ ని బ్యాన్ కూడా చేశారు. ఇప్పుడు ఈ క్రాఫ్టన్ కంపెనీ నుంచి మరో గేమ్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది.
పబ్ జీ.. ప్లేయర్స్ అన్నౌన్ బ్యాటిల్ గ్రౌండ్స్ వీడియో గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి గేమ్ ఇది. ఈ గేమ్ వల్ల లక్షలు పోగొట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఈ పబ్ జీ వల్ల మానసిక రుగ్మతల బారినపడి బాధపడిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ గేమ్ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నవాళ్లు, గేమ్ ఆడొద్దని హత్యలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. అయితే తర్వాత కొన్నాళ్లకు ఈ ఆటను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత క్రాఫ్టన్ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని వేరే గేమ్ లాంఛ్ చేశారు. కానీ, పబ్ జీ దక్కిన ఆదరణ ఈ గేమ్ కు దక్కలేదు. ఇప్పుడు ఈ క్రాఫ్టన్ కంపెనీ నుంచి ఇండియాలో సరికొత్త గేమ్ లాంఛ్ కాబోతోంది.
క్రాఫ్టన్ కంపెనీ తీసుకొచ్చిన పబ్ జీ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలుసు. అలాగే ఆ గేమ్ వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో కూడా అందరూ చూశారు. అయితే భారత ప్రభుత్వం చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తున్న సమయంలో ఈ గేమ్ ని కూడా బ్యాన్ చేశారు. ఆ తర్వాత బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా మొబైల్ అంటూ మరో గేమ్ ని ఇండియాలో లాంఛ్ చేశారు. ఇప్పుడు మరో సరికొత్త గేమ్ ని భారత్ లో లాంఛ్ చేసేందుకు క్రాఫ్టన్ కంపెనీ సిద్ధమైంది. 2021లో క్రాఫ్టన్ కంపెనీ సొంతం చేసుకున్న డ్రిమోషన్ ఈ గేమ్ ని డెవలప్ చేసింది. దీనికి ‘రోడ్ టూ వాలోర్ ఎంపైర్’ గా పేరు పెట్టారు.
ఇప్పటికే ఈ డ్రీమోషన్ కంపెనీ రోడ్ వాలోర్ ఎంపైర్స్ గేమ్ కి సంబంధించి పలు టీజర్లు రిలీజ్ చేసింది. అతి త్వరలోనే ఈ గేమ్ ని ఇండియాలో లాంఛ్ చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్లేస్టోర్ లో ఈ గేమ్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ చూపిస్తోంది. ప్లే స్టోర్ డిస్క్రిప్షన్ ప్రకారం.. ఎథేనా(యుద్ధ దేవత), ఓడిన్(ఆస్గార్డ్ చక్రవర్తి), మెడుసా, మాంటికోర్, అఖిలీస్ వంటి పాత్రలు ఉంటాయి. మీరు మీకు నచ్చిన క్యారెక్టర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది అచ్చు ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఈ గేమ్ లో అదనంగా స్టార్ట్ చేసే సమయంలో డ్రాగన్స్, ఏనుగులు వంటి కొన్ని జంతువులను ఎంపిక చేసుకోవచ్చు.
Krafton to open the pre-registration of Road to Valor: Empires in India 🇮🇳 today. It is a real-time PVP strategy mobile game and was released in a few countries last yr. pic.twitter.com/aHoiX39MEH
— GT (AI) (@GametubeI) February 23, 2023
ఈ గేమ్ చూసిన వాళ్లకు 2013లో సూపర్ సెల్ కంపెనీ వాళ్లు రిలీజ్ చేసిన ‘బూమ్ బీచ్’ గేమ్ తరహాలో అనిపిస్తుంది. అక్కడ కూడా శత్రురాజ్యాలపై దాడిచేసి వాటిని ఛేజిక్కించుకోవచ్చు. కాకపోతే ఇది అల్ట్రా మోడ్రన్ ఆయుధాలతో దాడులు చేయడం చూస్తాం. అయితే ఈ రోడ్ టూ అంపైర్ మాత్రం దేవుళ్లు, చక్రవర్తుల పేరుతో డ్రాగన్స్ ని పెట్టి ఏన్షియంట్ టచ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రాఫ్టన్ కంపెనీ విషయంలో వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుంది అనే ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. కానీ, ఈ రోడ్ టూ అంపైర్ గేమ్ కు సంబంధించి డ్రీమోషన్ కంపెనీ ఫొటోలు, ఫైల్స్ ను యాక్సెస్ చేయము అని ముందే ధ్రువీకరించింది. క్రాఫ్టన్ కంపెనీ నుంచి రాబోతున్న ఈ రోడ్ టూ అంపైర్ గేమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.