గూగుల్ ప్లే స్టోర్.. అంటే స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరికీ తెలిసిందే. మీకు కావాల్సన యాప్స్ ని సేఫ్ గా, నమ్మకంతో ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు గూగుల్ ప్లే స్టోర్ సైతం వారి వద్ద అందుబాటులో ఉన్న యాప్స్ ని మళ్లీ పరిశీలిస్తూ.. సమీక్షిస్తూ ఉంటుంది. అలా కొన్ని యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే గూగుల్ ప్లే స్టోర్ తమ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ప్లే స్టోర్ 16 యాప్స్ ని తొలగించింది. అంతేకాకుండా ఆ యాప్స్ కలిగి ఉన్న వారు వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలంటూ కోరింది. విషయం ఏంటంటే.. ఆ యాప్స్ వల్ల ఫోన్ బ్యాటరీ నాశనం చేస్తాయని చెబుతున్నారు.
అంతేకాకుండా డేటా కూడా ఎక్కువ వినియోగిస్తున్నాయంటూ హెచ్చరిస్తోంది. ఈ యాప్స్ ని ఇప్పటికే 20 మిలియన్ల మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నట్లు గూగుల్ ప్లే స్టోర్ గుర్తించింది. ఆ యాప్స్ తప్పుడు సమాచారం, యాడ్స్ తో యూజర్లను మోసం చేస్తున్నాయంటూ తెలిపింది. వినియోగదారులు ఆ యాప్స్ ని కలిగి ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలంటూ సూచించింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ ఈ యాప్స్ ని గుర్తించింది. ఈ 16 అప్లికేషన్స్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు ఆర్స్ టెక్నికా నివేదిక తెలిపింది. గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకునే వీలుండేది.
వీటిని క్యూఆర్ కోడ్ స్కానర్లు, ఫ్లాష్ లైట్, కరెన్సీ కన్వర్షన్, కెమెరా వంటి అవసరాల కోసం వినియోగించేవారు. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఎక్కువ బ్యాటరీ నాశనం చేసి, డేటాను వినియోగిస్తున్న అలాంటి ప్రమాదకర యాప్స్ ని తొలగించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్స్ ఏవంటే.. ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్ లోడర్, బూసన్ బస్, కరెన్సీ కన్వర్టర్, హైస్పీడ్ కెమెరా, ఫ్లాష్ లైట్+, క్విక్ నోట్, ఎజ్ డికా, కే-డిక్షనరీ, ఈజెడ్ నోట్స్, జోయ్ కోడ్, స్మార్ట్ టాస్క్ మేనేజర్ వంటి యాప్స్ ని తొలగించాలంటూ గూగుల్ ప్లే స్టోర్ తీవ్ర హెచ్చరకలు జారీ చేసింది. యూజర్లు సైతం అలాంటి యాప్స్ ఫోన్లో ఉంటే వాటిని వెంటనే అన్ ఇన్స్టాల్ చేయడమే మంచిది. ఎందుకంటే.. అలాంటి యాప్స్ వల్ల బ్యాటరీ లైఫ్ నాశనం అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.