అతి పెద్ద జనాభా గల దేశాల్లో ఇండియా స్థానం.. రెండోది. ఇంత జనాభా గల మనదేశ మొబైల్ మార్కెట్ లోకి రోజుకో స్మార్ట్ఫోన్ వచ్చి చేరడం సహజం. కాకుంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే.. మొబైల్ ప్రియులు అట్ట్రాక్ట్ అవుతారు. ఇప్పటివరకూ కెమెరా, ప్రాసెసర్, ర్యామ్, ఎక్సటర్నల్ స్టోరేజ్.. వంటి అధునాతన ఫీచర్స్ తో మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటున్న టెక్ కంపెనీలు.. ఇప్పుడు బ్యాటరీ సామర్త్యంపై కన్నేశాయి. తాజాగా.. డాగీ టెక్ కంపెనీ 12,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్త్యంతో స్మార్ట్ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ధర:
డాగీ ఎస్89 ప్రో.. ధర $239.99 డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 19 వేలు). అయితే.. ఈ ధర జూలై 29 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ఫోన్ ధర దాదాపు $700 డాలర్లు (రూ. 55 వేలు)గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. జూలై 25 నుండి AliExpress లో అందుబాటులో ఉండనుంది.
స్పెసిఫికేషన్స్:
12,000mAh పవర్ ఫుల్ బ్యాటరీతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Introducing the Doogee S89 Pro🙀. A real powerhouse beast of a rugged smartphone, crafted with a rear multi-color breathing light, powered by a 12,000 mAh battery capacity🔋 and a 65W super lightening fast charger⚡. #DoogeeS89Pro pic.twitter.com/em4UFXObqf
— DOOGEE (@DOOGEE_official) July 16, 2022