మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరులోనే 1000 వాట్స్ పవర్ ఉంది. చూడటానికి చాలా సింపుల్, కూల్ గా కనిపిస్తాడు. కానీ ఆలోచనలు మాత్రం వేరే లెవల్లో ఉంటాయి. దాన్ని అందుకోవడం ఇప్పట్లో ఎవరి వల్ల కాకపోవచ్చు. ఇక ధోనీ మైదానంలో ఉన్నాడంటే అర్జునుడిలా ఆలోచిస్తాడు. కేవలం విజయమే లక్ష్యంగా ప్లాన్స్ వేస్తాడు. చాలాసార్లు అది వర్కౌట్ అవడం ఇక్కడ విశేషం. అందుకే ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎవరికీ సాధ్యం కానీ రికార్డులని టీమిండియా సాధించింది. వన్స్ ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. జట్టులో శూన్యం ఆవరించిందనే చెప్పాలి. ఇక దానికి తోడు టీమిండియాకు కొత్త కష్టాలు కూడా వచ్చాయి. అవి ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయనే చెప్పాలి.
ఇక విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ స్వతహాగా ఫుట్ బాలర్. స్కూల్ చదువుతున్న టైంలో అనుకోకుండా వచ్చిన అవకాశం వల్ల గోల్ కీపర్ అవ్వాల్సిన వాడు కాస్త వికెట్ కీపర్ అయిపోయాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుతాలు చేసి జాతీయ జట్టులోకి వచ్చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. సీనియర్ల వద్దనుకోవడంతో టీ20 జట్టుకు కెప్టెన్ కూడా అయిపోయాడు. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తొలిసారి కప్ ని టీమిండియా గెలుచుకునేలా చేశాడు. అది జరిగిన నాలుగేళ్లకు అంటే 2011లో వన్డే ప్రపంచకప్, మరో రెండేళ్లకు అంటే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ గెలుచుకోవడంలో కెప్టెన్ గా కీలకపాత్ర పోషించాడు.
ఇక ధోనీ కెప్టెన్ గా ఎంత సక్సెస్ అయ్యాడో.. ఫినిషర్ గా అంతకంటే ఎక్కువగా సక్సెస్ అయ్యాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో మాత్రమే కాదు.. నరాలు తెగే ఉత్కంఠకర, అసలు గెలవడానికే ఛాన్సుల్లేని ఎన్నో మ్యాచుల్లోనూ అద్భుతాలు చేశాడు. ఇక ధోనీ వికెట్ల వెనక ఉన్నాడంటే.. క్రీజులో బ్యాటర్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాసరే ఔట్ అయిపోవడం గ్యారంటీ. ఇప్పటి స్టార్ క్రికెటర్లందరూ కూడా దాదాపు ధోనీ చేతిలో ఔటైనవాళ్లే! అయితే ధోనీ ఉన్నన్ని రోజులు కెప్టెన్- వికెట్ కీపర్-ఫినిషర్ గురించి టీమిండియా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. కానీ 2020లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే అసలు కథ మొదలైంది.
మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత అతడి వికెట్ కీపర్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అనే క్వశ్చన్ కు రిషభ్ పంత్ ఆన్సర్ లా కనిపించాడు. అందుకు తగ్గట్లే బీసీసీఐ కూడా అతడిని ట్రైన్ చేస్తూ వచ్చింది. ధోనీ అంత కాకపోయినా సరే చాలావరకు పంత్ కష్టపడుతూ వచ్చాడు. ఎన్నో మ్యాచుల్లో బాగానే వికెట్ కీపింగ్ చేశాడు. యంగ్ క్రికెటర్ పంత్, భారత జట్టుకు రెగ్యులర్ కీపర్ అయిపోవడంతో ప్రత్యామ్నయాల గురించి బీసీసీఐ పెద్దగా ఆలోచించలేదు. కానీ న్యూయర్ ముందురోజు పంత్ కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకోవడానికి మరో ఏడాది పట్టేలా ఉందని డాక్టర్స్ చెప్పారు. దీంతో టీమిండియాకు పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది.
రాబోయే రెండేళ్లలో టీమిండియా… ఆసియాకప్, వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు ఆడనుంది. ఇందులో భాగంగానే హార్దిక్ పాండ్యని పూర్తిస్థాయి కెప్టెన్ గా చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే శ్రీలంకతో టీ20 సిరీస్ కు మనోడినే కెప్టెన్ గా చేసింది. ఇక వికెట్ కీపర్ గా పంత్ ఉండాల్సింది కానీ అతడు లేకపోయేసరికి ప్రస్తుతం కేఎల్ రాహుల్.. వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఇతడు కూడా అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లందరూ కూడా టెంపరరీగా ఉంటారు తప్పించి, వీళ్లని పూర్తిస్థాయి కీపర్ ని చేయాలని బీసీసీఐ ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఆ అవసరం రాలేదు కాబట్టి. కానీ ఇప్పుడు పంత్ కు యాక్సిడెంట్ కావడంతో ఈ ప్రశ్న రైజ్ అవుతోంది. ఇప్పటికిప్పుడు అనుకున్నా సరే ధోనీ లాంటి కీపర్ తయారు చేయడం అసాధ్యం. ఈ క్రమంలోనే ధోనీ లాంటి వాడు ఎప్పుడు దొరుకుతాడా అని సగటు క్రికెట్ అభిమాని అనుకుంటున్నాడు. అదే టైంలో ధోనీ లాంటి వాడు దొరకడం జరిగేపనేనా అని సందేహపడుతున్నాడు. మరి ధోనీ లాంటోడు ఎప్పుడు దొరుకుతాడని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
18 Years
538 Matches
17266 Runs
No. 1 ODI Ranking
224, 183* HS
16 100s
107 50s
1486 4s
359 6s
634 Catches
195 Stumpings
178 Wins as Captain
3 ICC Trophies
Test Championship Mace
No. 1 In ODI, TEST, T20I
1 Man 👉 @MSDhoni #18YearsOfDHONIsm 🏏❤️#MSDhoni #WhistlePodu #TeamIndia pic.twitter.com/MJljE5QuPx— DHONIsm™ ❤️ (@DHONIism) December 23, 2022