విరాట్ కోహ్లీతో అతిగా ఫోజులు కొడుతూ ఫొటో దిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన కుర్రాడు అరెస్ట్ అయ్యాడు. అతనితో పాటు మరో నలుగు యువకుల్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఓ నలుగురు కుర్రాళ్లు సెక్యురిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చారు. తమ అభిమాన ఆటగాడు విరాట్కోహ్లీతో ఫొటో దిగేందుకు వాళ్లు ఈ సహసం చేశారు. అందులో ఇద్దరు విరాట్ కోహ్లీతో ఫొటో దిగారు. మరో ఇద్దరినీ సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్లారు.
రెండో రోజు ఆట మూడో సెషన్లో కోహ్లీ ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. మైదానంలోకి వచ్చిన కుర్రాళ్లు కోహ్లీ వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, తాను బయోబబుల్ ఉన్నందుకున్న తనను ముట్టుకోకుండా.. ఫొటోలు తీసుకోవాలని కోహ్లీ వారిని కోరాడు. దీంతో ఇద్దరు యువకులు కోహ్లీతో ఫొటోలు దిగారు. ఇక వారిద్దరి అక్కడ ఏమనకుండా సెక్యూరిటీ సిబ్బంది బయటికి తీసుకెళ్లారు. కాగా భద్రతా నిబంధనలను అతిక్రమించి, గ్రౌండ్లోకి వచ్చినందుకు నలుగురు కుర్రాళ్లపై బెంగళూరు పోలీసులు కేస నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురిలో ఇద్దరూ మైనర్లు ఉన్నారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కింగ్ కోహ్లీ ముందే ఫోజులా? నీకు బాగా బలిసిందిరా! ఫ్యాన్స్ ఫైర్!
Fans entered in the ground to take selfie with #viratkohli #Virat #Kohli #IndvsSL pic.twitter.com/jygYxZhKRR
— TRENDING CRIC ZONE (@rishabhgautam81) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.