వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్తో భారత కుర్రాళ్లు తలపడనున్నారు. ఈ మెగా ఫైనల్కు ముందు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్లతో వీడియో కాల్లో మాట్లాడి, వారికి పలు సుచనలు అందించాడు. 2008లో కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అండర్-19 ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్-19 జట్టు సభ్యులు కౌశల్ తాంబే, రవ్జర్ధన్ హంగర్గేకర్ విరాట్ కోహ్లీతో వీడియో కాల్ మాట్టాడిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హంగర్గేకర్ తన పోస్ట్లో, ‘విరాట్ కోహ్లీ భయ్యాతో చాట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. తన నుంచి జీవితంతో పాటు క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. ఇది రాబోయే కాలంలో మాకు సహాయపడుతుంది’ అని పేర్కొన్నాడు. అదే సమయంలో, కౌశల్ తాంబే తన పోస్ట్లో విరాట్ను గొప్ప ఆటగాడిగా అభివర్ణిస్తూ, ‘ఫైనల్కు ముందు గొప్ప ఆటగాడి నుంచి విలువైన సూచన’ అంటూ రాసుకొచ్చాడు. మరి ఒక మెగా టోర్నీ ఫైనల్కు ముందు యువ క్రికెటర్లలో జోష్ నింపేలా వారితో మాట్లాడిన కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.