టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఉన్న గొప్ప క్రికెటర్లలోనే నంబర్ వన్ ఆటగాడు. అతన్ని అవుట్ చేయడమే ఒక కలగా భావించే యువ క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ వికెట్ దక్కింతే.. మ్యాచ్ గెలిచినంత సంబరపడే బౌలర్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ టెస్టు క్రికెట్లో పెద్దగా ఫామ్లో లేకపోయనా.. అతని వికెట్ ఎంతో కీలకం. అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నా కూడా.. కోహ్లీ క్రీజ్లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని బౌలింగ్ చేయాల్సిందే. అలాంటి.. ఆటగాడు కాబట్టే కోహ్లీని అభిమానించే, ఆరాధించే క్రికెటర్లు సైతం ఉన్నారు. వారి జాబితాలో బంగ్లాదేశ్ యువ సంచనలం మెహిదీ హసన్ మిరాజ్ కూడా ఒకడు. ఈ యువ ఆల్రౌండర్.. టీమిండియాపై వన్డే, టెస్టు సిరీస్లో ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడో అందరూ చూశారు.
టీమిండియా లాంటి పటిష్టమైన జట్టుపై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ను 2-1తో తేడాతో గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఈ మెహిదీ హసన్. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. ఒంటిరిగా విరోచిత పోరాటం చేస్తూ.. 38 పరుగులతో నాటౌట్గా నిలిచి.. బంగ్లాదేశ్కు గొప్ప విజయాన్ని అందించాడు. ఆ తర్వాత.. రెండో వన్డేలో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న భారత్పై 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టాడు. అలాగే బౌలింగ్లోనూ సంచలనాలు నమోదు చేశాడు. మూడు వన్డేల్లో మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. 141 పరుగులు చేశాడు. ఇక టెస్టు సిరీస్లోనూ మెహిదీ అదరగొట్టాడు. తొలి టెస్టులో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన మెహిదీ.. బ్యాటింగ్లోనూ రాణించి.. 25 పరుగులు చేశాడు.
అలాగే భారత రెండో ఇన్నింగ్స్లోనూ ఒక వికెట్ పడగొట్టి.. తొలి టెస్టులో మొత్తం 5 వికెట్లు సాధించాడు. ఇక చివరిదైన రెండో టెస్టులోనూ మెహిదీ 6 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ అద్భుతంగా పోరాడి ఓడినా.. టీమిండియాను 145 పరుగుల టార్గెట్ను ఈజీగా చేరుకోనియకుండా.. మోహిదీ వణికించాడు. ఈ 6 వికెట్లలో ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ వికెట్ కూడా ఉంది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీని.. ఇబ్బంది పెట్టిన మెహిదీ.. 20 బంతుల్లో ఒక్క పరుగు చేసిన కోహ్లీని అద్భుతమైన బంతితో పెవిలియన్కు చేర్చాడు. కోహ్లీ వికెట్ దక్కిన ఆనందంలో మోహిదీ చేసుకున్న సంబరాలు మాటల్లో చెప్పలేం.
అయితే.. ఈ సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించి.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో తనను అవుట్ చేసిన మెహిదీకి విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన బహుమానం అందించాడు. తన జెర్సీపై సంతకం చేసి మెహిదీకి అందించాడు కోహ్లీ. దాన్ని ఎంతో అపురూపంగా అందుకున్న మోహిదీ.. ‘గ్రేటెస్ట్ బ్యాటర్ నుంచి ప్రత్యేకమైన సావియర్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని’ సోషల్ మీడియాలో పేర్కొంటూ మురిసిపోయాడు. మరి కోహ్లీ ఇచ్చిన గిఫ్ట్పై, మెహిదీ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Special souvenir from one of the greatest cricketer Virat Kohli. 🤝 pic.twitter.com/y67twA2Rle
— Mehidy Hasan Miraz (@Officialmiraz) December 25, 2022