ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో కోహ్లీ సెంచరీ చేసేశాడు. దాదాపు మూడేళ్ల వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ వేస్తూ సుధీర్ఘ ఫార్మాట్ లో మూడంకెల స్కోరుని అందుకున్నాడు. దీంతో కోహ్లీ ఖాతాలో 75వ సెంచరీ చేరింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన పవరేంటో చూపించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆచితూచి ఆడిన కోహ్లీ.. మూడంకెల స్కోరుని అందుకున్నాడు. సెంచరీతో అదరగొట్టాడు. దీంతో దాదాపు మూడేళ్ల ఎదురుచూపులకు తెరదించాడు. ఈ క్రమంలోనే విరాట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మ్యాచులో గెలవడం సంగతి అటుంచితే కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేసేసరికి టీమిండియా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ నాలుగో టెస్టులో ఏం జరుగుతుంది? కోహ్లీ ఎన్నేళ్ల తర్వాత సెంచరీ చేశాడు? ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా, మూడో మ్యాచులో ఓడిపోయింది. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టుని డ్రా దిశగా తీసుకెళ్తోంది. అయితే ఇదే మ్యాచులో గిల్ సెంచరీతో ఆకట్టుకోగా, ఇప్పుడు కోహ్లీ సెంచరీతో దుమ్మురేపాడు. నవంబరు 2019 తర్వాత టెస్టుల్లో మూడంకెల స్కోరుని అందుకోని విరాట్.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో మాత్రం 241 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ఘనత సాధించి తనలో ఏ మాత్రం పవర్ తగ్గలేదని ప్రూవ్ చేశాడు. దీంతో కోహ్లీ ఖాతాలో 75వ శతకం చేరింది. గతేడాది టీ20ల్లో, ఈ ఏడాది ప్రారంభంలో వన్డే సెంచరీ చేసిన కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.
Virat Kohli scores a Test hundred for the first time in over two years 🎉#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/2v5MzV4qcL
— ICC (@ICC) March 12, 2023