న్యూజిలాండ్తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, సుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించినా.. కోహ్లీ, పూజారా డకౌట్ అయ్యారు.
అజజ్ పటేల్ వేసిన 30వ ఓవర్ రెండో బంతికి పుజారా క్లీన్ బౌల్డ్ కాగా, ఆఖరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇలా ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. క్రీజ్లో మయాంక్(47), శ్రేయస్ అయ్యర్ (7) పరుగులతో ఉన్నారు.