పంత్ ఎప్పుడైతే గాయపడ్డాడో అప్పటి నుంచి టీమిండియాకు సరైన వికెట్ కీపర్ దొరకడం లేదు.రీప్లేస్ గా వచ్చిన భరత్, కిషాన్ కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వేటు వేసి ఒక కొత్త వికెట్ కీపర్ కి ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం.
ప్రస్తుతం టీమిండియాకు వికెట్ కీపర్ సమస్య ఏర్పడింది. వన్డేల్లో రాహుల్, సంజు శాంసన్ తో నెట్టుకొస్తున్న టెస్టుల్లో మాత్రం రిషబ్ పంత్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో పంత్ ఎప్పుడైతే గాయపడ్డాడో అప్పటి నుంచి టీమిండియాకు సరైన వికెట్ కీపర్ దొరకడం లేదు. ఈ యంగ్ వికెట్ కీపర్ లేకుండానే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్ ఆడింది. పంత్ కి రీప్లేస్ గా వచ్చిన భరత్, కిషాన్ కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. వచ్చే నెలలో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఉండడంతో.. ఇప్పుడు సెలెక్టర్లు వీరిద్దరి మీద వేటు వేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి ప్లేస్ లో ఒక వికెట్ కీపర్ ని సెలెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
భరత్, ఇషాన్ కిషన్ టెస్టుల్లో వీరిద్దరిలో ఒక్కరికి ప్లేస్ దక్కడమే కష్టమనుకున్న తరుణంలో పంత్ యాక్సిడెంట్ కారణంగా ఇద్దరికీ టీంఇండియాలో పిలుపు వచ్చింది. అయితే ఇద్దరూ అంది వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారనే చెప్పాలి. భరత్ కీపింగ్ లో ఆకట్టుకున్నా.. బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇక అదే సమయంలో కిషాన్ కూడా బ్యాటింగ్ తో పాటు.. కీపింగ్ లో అంతగా స్కిల్స్ లేవని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విండీస్ తో టెస్టు సిరీస్ కి ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఉపేంద్ర యాదవ్ సెలెక్ట్ చేయాలని భావిస్తున్నారట.
26 సంవత్సరాల వయసున్న ఉపేంద్ర యాదవ్ ఉత్తర ప్రదేశ్ తరపున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. 45 సగటుతో 1666 పరుగులు చేసాడు. 9 ఏళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ తరపున ఆడిన ఉపేంద్ర యాదవ్.. ప్రస్తుతం రైల్వేస్ తరపున ఆడుతున్నాడు. ఇక ఉపేంద్ర యాదవ్ కి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో పాటు.. బ్యాటింగ్ లో మంచి రికార్డ్ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ వెస్టిండీస్ పర్యటనలో ఈ వికెట్ కీపర్ సెలక్ట్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 27 న టెస్టు సిరీస్ కి సంబంధించిన జట్టుని సెలెక్ట్ చేయనున్నారు. మరి ఈ యువ వికెట్ కీపర్ నే సెలక్ట్ చేస్తారా? లేకపోతే వేరే వారి మీద మొగ్గు చూపుతారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.