టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ… భారత క్రికెట్పైనే కాదు, ప్రపంచ క్రికెట్పైన తన ముద్ర వేశాడు. జులపాల జుట్టుతో క్రికెట్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన మాహీ, హెలికాఫ్టర్ షాట్ వంటి కొత్త కొత్త షాట్స్ని పరిచయం చేశాడు. కెప్టెన్గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మిస్టర్ కూల్.. సరిగ్గా ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. 2020 ఆగస్టు 15న అన్ని ఫార్మాట్ల క్రికెట్కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో రెండేళ్ల కిందట ధోనీ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టు తాజాగా వైరల్ గా మారింది.
“కెరీర్ ఆసాంతం మద్దతు నిలిచి ప్రేమాభిమానులు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 1929 గంటల నుంచి నన్ను రిటైర్డ్ గా పరిగణించాలి” అని పోస్టు పెట్టాడు. అప్పుడు 1929 గంటలు.. అనే పదం వైరల్ గా మారగా.. తాజాగా మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్ గెలుచింది. ఆ తరువాత 2011లో అంటే.. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ రెండో వన్డే ప్రపంచకప్ ను అందుకుంది. అంతకుముందు 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ ను కూడా టీమ్ ఇండియానే సొంతం చేసుకుంది. అయితే ఈ రెండింటినీ తన నాయకత్వ పటిమతో సాధించి పెట్టాడు ఝార్ఖండ్ డైనమైట్. అలాగే.. భారత జట్టును ఐసీసీ. ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోనూ నిలబెట్టాడు.
2014లో టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనీ 2017 నాటికి వన్డే, టీ20 సారథ్య బాధ్యతలను వదిలేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి నేతృత్వంలో 2019 వరల్డ్ కప్ లోసెమీస్ కు చేరినా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. చివరగా ‘రెండేళ్ల కిందట 2020 ఆగస్ట్ 15న రాత్రి 7.29 గంటలకు (1929 గంటలు) రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. అదీనూ ‘ఆర్మీ టైమ్ పద్ధతిలో వెల్లడించాడని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ధోని క్రికెట్ కు సేవలందించినగాను. 2011లో భారత ఆర్మీ ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ అందించి గౌరవించింది. అందుకే తాను వీడ్కోలు పలికిన సమయం.. రాత్రి 7.29 గంటలు తెలపడానికి.. ఆర్మీ టైమ్ పద్ధతినే (1929 గంటలు) పాటిస్తూ ఇన్స్టాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది.
కాగా భారత క్రికెట్ చరిత్రలో తన పేరును ధోని సువర్ణ అక్షరాలతో లిఖించాడు. ఐసీసీ నిర్వహించిన అన్ని టోర్నమెంట్లనూ తన ఖాతాలో వేసుకున్న తొలి కెప్టెన్ ధోని మాత్రమే. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిని ధోని సారథ్యంలోనే భారత్ కైవసం చేసుకుంది. ధోని తన అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లు కలిపి 17,226 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో 15 సెంచరీలు ఉన్నాయి. ధోనీ క్రికెట్ ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదే చదవండి: MS Dhoni: అంతర్జాతీయ లీగ్లలో భారత ఆటగాళ్ల ప్రవేశంపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు!
ఇదే చదవండి: అతను చెప్పేంత వరకు సచిన్ గురించి నాకు తెలియదు: అక్తర్