క్రీడల్లో రాణించినవారికి ప్రభుత్వాలు భారీ ఎత్తున నజరానాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నాయి. గతంలో పీవీ సింధు ఒలంపిక్ పతకం సాధించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమె భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బాక్సర్ నిఖత్ జరీన్కు కూడా భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు..
ప్రపంచ వేదికల మీద తన పంచ్ పవర్ రుచి చూపిస్తూ.. వరుస పతకాలు సాధిస్తూ.. తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది బాక్సర్ నిఖత్ జరీన్. గతేడాది మేలో ఇస్తాంబుల్లో జరిగిన మహిళల వరల్డ్ చాంపియన్చాంపియన్ షిప్స్ విజేతగా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది నిఖత్ జరీన్. సామాన్య సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన నిఖత్.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. బాక్సింగ్లోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఆమె సాధించిన విజయాలను ప్రశంసించడమే కాక.. తగిన నజరానా ఇచ్చి సత్కరించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు..
మహిళల వరల్డ్ చాంపియన్చాంపియన్ షిప్స్ విజేతగా నిలిచిన నిఖత్ జరీన్కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్లో 600 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థలం విలువ సుమారు 20 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. రాష్ట్ర క్రీడా శాఖ తరఫున నిఖిత్ జరీన్కు ఈ ఇంటి స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. నిఖత్ జరీన్ తండ్రికి అందజేశారు. దీంతోపాటు త్వరలోనే నిఖిత్ జరీన్కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సర్గా పలు అంతర్జాతీయ ఈవెంట్లలో వరుస పతకాలు సాధిస్తూ.. దేశ కీర్తి పతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాస్తోంది.. ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన ఐదో భారతీయ మహిళా బాక్సర్గా నిలిచింది నిఖత్. గతేడాది మే 19న ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో.. 52 కిలోల విభాగంలో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్ జుటామాస్ను ఓడించిన ఈ ఘనత సాధించింది నిఖత్.
ఈ విజయం సాధించిన సందర్భంగానే నిఖత్ జరీన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇంటి స్థలం కూడా కేటాయించనున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటి స్థంలానికి సంబంధించిన పేపర్లను ఆమె తండ్రికి అందజేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.