పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు దొంగలు షాక్ ఇచ్చారు. పీఎస్ఎల్ 2023 సీజన్ కోసం లాహోర్ లోని గడాఫీ మైదానంలో 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఆ 8 సీసీటీవీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ లీగ్ లు జరుగుతున్నాయి. దాంతో ఈ క్రికెట్ లీగ్ లు జరిగే అన్ని ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి అక్కడి దేశాలు. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో ముఖ్యపాత్ర సీసీ కెమెరాలదే. వీటితోనే దొంగల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. దాంతో దొంగలు ఏకంగా సీసీ కెమెరాలనే ఎత్తుకెళ్లడం స్టార్ట్ చేశారు. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు ఇలాంటి షాకే తగిలింది. స్టేడియంలో, స్టేడియం బయట శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీసీ కెమెరాలను బిగించారు నిర్వాహకులు. ఫిబ్రవరి 26న మ్యాచ్ ఉన్న నేపథ్యంలోనే ఆ సీసీ కెమెరాలు చోరీకి గురయ్యాయి.
పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వాహకులకు దొంగలు షాక్ ఇచ్చారు. పీఎస్ఎల్ 2023 సీజన్ కోసం లాహోర్ లోని గడాఫీ మైదానంలో 8 సీసీటీవీ కెమెరాలను బిగించారు నిర్వాహకులు. స్టేడియం బయట, లోపల కదలికల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఇక ఫిబ్రవరి 26న గడాఫీ మైదానంలో లాహోర్ ఖలందర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే 8 సీసీటీవీ కెమెరాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మ్యాచ్ కు ముందు స్టేడియంలో ఏర్పాట్లను పరీక్షించిన అధికారులకు ఊహించని షాక్ ఇచ్చారు దొంగలు. సీసీటీవీ కెమెరాలతో పాటుగా ఫుటేజీని చూసేందుకు స్టేడియంలో పెట్టిన మానిటర్ ని సైతం ఎవరో దొంగిలించినట్లు సమాచారం.
అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే? మైదానంలోకి బయటి వ్యక్తులకు అనుమతి ఉండదు. క్రికెటర్లకు మాత్రమే ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. దాంతో సీసీటీవీ కెమెరాలను ఎవరు ఎత్తుకెళ్లారు అన్న విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి సీసీటీవీ కెమెరాలు ఎత్తుకెళ్లిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.