టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో మూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 82 పరుగులతో ఒంటిచేత్తో అసాధ్యమనుకున్న మ్యాచ్ను గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లోనూ 62 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్స్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే పేరిటి ఉంది. టీ20 ప్రపంచ కప్పుల్లో జయవర్దనే మొత్తం 1016 పరుగులు చేశాడు. ఈ రికార్డును కోహ్లీ బంగ్లాతో మ్యాచ్లో బద్దలు కొట్టాడు.
తన వ్యక్తిగత స్కోర్ 16 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్పుల్లో 1017 పరుగులు పూర్తి చేసుకుని జయవర్దనే రికార్డును బద్దలుకొట్టి.. టీ20 వరల్డ్ కప్స్లో నంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 36 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కొంత కాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 8 బంతుల్లో 2 పరుగులు చేసి అవుటై నిరాశపరిచాడు. మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కొద్దిసేపు బంగ్లా బౌలర్లు వణికించాడు. 16 బంతుల్లోనే 4 ఫోర్లతో 30 పరుగులు చేసి షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
🚨 Yet another milestone unlocked 🔓@imVkohli becomes the leading run-getter in the Men’s #T20WorldCup! 🔝 👏
Follow the match ▶️ https://t.co/Tspn2vo9dQ#TeamIndia | #INDvBAN pic.twitter.com/P6Ipxt4XRG
— BCCI (@BCCI) November 2, 2022