క్రికెట్ అనే కాదు ఏ గేమ్ అయినా సరే ఆటగాళ్లు చేసే చిన్న చిన్న తప్పులు భారీ మూల్యానికి కారణం అవుతుంటాయి! మ్యాచ్ గెలిస్తే అలాంటి వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆ విషయం హాట్ టాపిక్ అయిపోతుంది. నెటిజన్స్ మధ్య ఎడతెగని చర్చ జరుగుతుంది. సేమ్ ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయమే టీ20 ప్రపంచప్ మ్యాచ్ సందర్భంగా జరిగింది! మ్యాచ్ ఫలితం మారిపోవడంలో కీలకపాత్ర పోషించినట్లు అనిపించింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురవారం సూపర్-12 మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లా జట్టు ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు స్కోరు చేశారు. చెప్పాలంటే ఇంతకంటే ఎక్కువే పరుగులు చేయాలి. కానీ చివరి 5 ఓవర్లు 29 పరుగులే ఇచ్చి బంగ్లా బౌలర్స్ శెభాష్ అనిపించారు. ఇక ఆ తర్వాత ఛేదనలో 101 పరుగులకే బంగ్లా జట్టు ఆలౌటైంది. ఓటమిని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోవడానికి బ్యాటర్ల వైఫల్యంతో పాటు కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ తీసుకున్న ఓ నిర్ణయం కూడా కారణమని అనిపిస్తోంది. ఎందుకంటే 39-3 స్కోరుతో బంగ్లాదేశ్ టార్గెట్ ఛేజ్ చేస్తున్న సమయంలో.. నోర్జే బౌలింగ్, షకీబ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నేరుగా వేసిన ఓ బంతి.. షకీబ్ కుడి ప్యాడ్ ని తాకింది. వెంటనే అంపైర్ ఔట్ సిగ్నల్ ఇచ్చేశాడు. అప్పటికే బంగ్లాదేశ్ జట్టుకి రెండు డీఆర్ఎస్ లు ఇంకా మిగిలే ఉన్నాయి. కట్ చేస్తే.. గ్రౌండ్ నుంచి షకీబ్ బయటకెళ్లిపోయాడు. రిప్లే అని అది నాటౌట్ అని తేలింది. ఒకవేళ షకీబ్ రివ్యూ తీసుకుని ఉంటే.. మ్యాచ్ ఫలితం వేరేలా ఉండొచ్చు. లేదంటే భారీ పరుగుల తేడాతో కాకుండా సాధారణంగా ఓడిపోయిండేది. దీంతో నెటిజన్స్.. ఔట్ కాదని తెలిసినా సరే ఎందుకు కామ్ గా వెళ్లిపోయాడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
— MINI BUS 2022 (@minibus2022) October 27, 2022
Naagins ☕☕😭
— Sir Shubmoun bill Popa 🇮🇳 (@69popa_) October 27, 2022