బ్యాట్స్మన్ ఔట్ల విషయంలో ప్లేయర్లు రివ్యూ కోరే అవకాశం క్రికెట్లో ఉంది. అంపైర్లు ఇచ్చిన నిర్ణయంపై సమీక్షకు వెళ్లే ఛాన్స్ బ్యాటింగ్ టీమ్తో పాటు బౌలింగ్ జట్టుకూ ఉంది. అయితే ఒకే బాల్కు రెండుసార్లు రివ్యూకు వెళ్లడం మాత్రం ఇప్పటిదాకా జరగలేదు.
క్రికెట్లో అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనది కాదని భావిస్తే ఆటగాళ్లు రివ్యూ కోరడం మామూలే. టెస్ట్, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా ప్లేయర్లకు రివ్యూ అందుబాటులో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ దగ్గర నుంచి ఐపీఎల్ లాంటి లీగ్ క్రికెట్ వరకు డీఆర్ఎస్కు వెళ్లే సదుపాయం ఉంది. బ్యాటింగ్ టీమ్తో పాటు బౌలింగ్ టీమ్ కూడా రివ్యూలకు వెళ్లొచ్చు. అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మాత్రం ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇంతవరకు ఎన్నడూ లేని రీతిలో.. ఒకే బాల్కు రెండుసార్లు ప్లేయర్లు రివ్యూ కోరారు. తిరుచ్చి, దిండిగల్ డ్రాగన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. దిండిగల్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన బాల్కు ఆర్ రాజ్కుమార్ అనే బ్యాటర్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అంపైర్ ఔట్ ఇవ్వగా.. బ్యాట్స్మన్ రివ్యూ కోరాడు.
బ్యాట్స్మన్ రివ్యూ కోరడంతో రంగంలోకి దిగిన థర్డ్ అంపైర్.. బాల్ బ్యాట్కు తాకలేదని, నేలకు తాకడంతో అల్ట్రా ఎడ్జ్లో స్పైక్ కనిపించిందని నిర్ధారణకు వచ్చాడు. థర్డ్ అంపైర్ బ్యాటర్ను నాటౌట్గా ప్రకటించాడు. కానీ ఈ నిర్ణయంతో అశ్విన్ సంతృప్తి చెందలేదు. అనూహ్యంగా అతడు డీఆర్ఎస్ కోరాడు. దీంతో షాకైన అంపైర్లు మరోసారి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసి నాటౌట్ అని తేల్చారు. అప్పటికి 3 రన్స్ మాత్రమే చేసిన రాజ్కుమార్.. ఆ తర్వాత చెలరేగి ఆడి 22 బాల్స్లో 39 రన్స్ చేశాడు. ఈ ఘటనపై మ్యాచ్ తర్వాత అశ్విన్ మాట్లాడుతూ.. బాల్ బ్యాట్ను దాటి వెళ్లేందుకు ముందు స్పైక్ కనిపించిందన్నాడు. మరో యాంగిల్లో చెక్ చేస్తారనే ఉద్దేశంతోనే తాను డీఆర్ఎస్కు వెళ్లానని తెలిపాడు. ఒకే బాల్కు బ్యాటర్, బౌలర్ రివ్యూ కోరిన ఘటన బహుశా క్రికెట్లో ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ సెకండ్ టైమ్ రివ్యూలో రిజల్ట్ మారితే అంపైర్ను సస్పెండ్ చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు.
2 reviews in one ball, one by batter and one by bowler (Ashwin).
Rarest of incident in world cricket. pic.twitter.com/jB1zZ9qcmw
— Johns. (@CricCrazyJohns) June 14, 2023