విరాట్ కోహ్లీ.. ఈ పేరు ప్రెజెంట్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎంత గట్టిగా వినిపిస్తోంది అంటే.. మొన్నమొన్నటి వరకు పరుగులు చేయట్లేదు, రికార్డుల కోసమే ఆడుతున్నాడు అని అన్నవాళ్లే.. ఇప్పుడు కోహ్లీ తోపు.. దమ్ముంటే ఆపు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే.. కోహ్లీ లాంటి అనుభజ్ఞుడు జట్టుకు ఎందుకు అవసరమో ఇలాంటి మ్యాచులు జరిగినప్పుడే తెలుస్తుంది. ఇక కోహ్లీ ఇన్నింగ్స్ తర్వాత చాలామంది మాజీలు, సెలబ్రిటీలు ట్వీట్స్ పెట్టారు. బంగ్లాదేశ్ ఆటగాడు పెట్టిన ట్వీట్ మాత్రం కాస్త ఆసక్తికరంగా అనిపించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే సచిన్ తర్వాత ఆ రేంజ్ లో క్లాస్ బ్యాటింగ్ చేశాడు, చేస్తున్నాడు. కానీ కొన్నాళ్ల నుంచి అటు కెప్టెన్ గా, ఇటు బ్యాటర్ గా ఫెయిలవుతూ వచ్చాడు. అలాంటి కోహ్లీ.. కొన్నాళ్ల క్రితం సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. ఇక పాక్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ తో తనపై విమర్శలు చేసిన అందరి నోళ్లు మూతపడేలా చేశాడు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్ఫీకర్ రహీమ్.. కోహ్లీని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
‘నీలాంటి శక్తిమంతుడికి ఎలా గౌరవం ఇవ్వాలో దేవుడికి తెలుసు.. అద్భుతమైన రన్ ఛేజ్, అంతకంటే అద్భుతమైన మ్యాచ్’ అని ముస్ఫీకర్ రహీమ్ ట్విట్టర్ లో కోహ్లీ గురించి రాసుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే మనమే కాదు ఇతర దేశాల స్టార్ క్రికెటర్స్ కూడా ఫిదా కావాల్సిందే. దానికి ఈ ట్వీట్ ఉదాహరణ. ఇదిలా ఉండగా మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అర్షదీప్, హార్దిక్ తలో 3 వికెట్లు తీశారు. ఇక ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా గెలుస్తుందా లేదా అని చాలామంది సందేహపడ్డారు. అలాంటి టైంలో తన అనుభవాన్ని బయటకు తీసిన విరాట్.. తనని అభిమానులు ముద్దుగా పిలిచే కింగ్ అనే పేరుకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. మ్యాచ్ ని ఒంటిచేత్తో గెలిపించాడు. మరి కోహ్లీని బంగ్లా క్రికెటర్ ఆకాశానికెత్తేలా ట్వీట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
@imVkohli Almighty knows how to give respect to a Legend like you ✊✊✊✊what a run chase and what a match…😇😇😇 pic.twitter.com/G0CfSEzpfZ
— Mushfiqur Rahim (@mushfiqur15) October 23, 2022