టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరస మ్యాచులు గెలవడంతో ఆటగాళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఇంకా హ్యాపీగా ఉన్నాడు. తర్వాతి మ్యాచుల కోసం ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడు. కప్ కొట్టడమే లక్ష్యంగా ప్రాక్టీసు చేస్తున్నాడు. సెషన్స్ అన్నీ కూడా అదే ఊపులో జరుగుతున్నాయి. ఇంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నారు. ఆస్ట్రేలియా వీధుల్లో తిరుగుతూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో చాలా విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఈసారి అంచనాలు పెద్దగా లేకపోయేసరికి ఆటగాళ్లు.. చాలా ఫ్రీ మైండ్ తో ఆడుతున్నారు. పాక్ తో మ్యాచ్ లో కోహ్లీ, హార్దిక్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకోగా.. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ కూడా హాఫ్ సెంచరీలు చేసి విజయానికి కారణమయ్యారు. ఇక ప్రస్తుతం దీని గురించి చర్చ నడుస్తోంది.
ఇక తర్వాతి మ్యాచ్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ప్రాక్టీసు బాగా జరుగుతోంది. దీని తర్వాత దొరికిన ఖాళీ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు సమైరాతో ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోహిత్ తోపాటు అతడి భార్య రితిక తన ఇన్ స్టాలోనూ అవే ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇక సమైరా ముద్దుముద్దుగా ఉన్న ఈ ఫొటోలు.. నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరి రోహిత్-సమైరా ఫొటోస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.