ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ కాస్త టైట్గానే బౌలింగ్ వేశారని చెప్పాలి. టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ సమయంలో అది చాలా మంచి స్కోర్ అనే అనిపించింది. కానీ, రెండో ఇన్నింగ్స్ ప్రారంభం తర్వాతే అర్థమైంది ఇంకో 30 పరుగులు ఉన్నా కూడా సరిపోయేవి కాదేమో అని. ఇంగ్లాండ్ 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ కూడా నష్టపోకుండా టార్గెట్ని ఫినిష్ చేసింది. జోస్ బట్లర్(80*)- అలెక్స్ హేల్స్(86*) వీరోచిత పోరాటంతో టీమిండియాకి ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు నెట్టింట ఒకటి తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా వరల్డ్ కప్ విషయంలో గతంలో ధోనీ ఒక ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఓరియో బిస్కెట్ కంపెనీతో కలిసి స్పెషల్ ఎడిషన్ ఒకటి లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 2011లో ఓరియో బిస్కెట్ లాంఛ్ అయ్యింది.. అప్పుడు 28 సంవత్సరాల తర్వాత టీమిండియా వరల్డ్ కప్ కొట్టింది. ఇప్పుడు 2022లో ఓరియో స్పెషల్ ఎడిషన్ లాంఛ్ చేస్తోంది.. ఈ సంవత్సరం కూడా వరల్డ్ కప్ కొడుతుందని ఆశిస్తున్నాం అంటూ ధోనీ చెప్పడం చూశాం. తొలుత ఆ మాటలు ట్రోలింగ్ గురైనా కూడా తర్వాత పరిస్థితులు అలాగే ఉన్నాయంటూ అంతా సంబరాలు చేసుకున్నారు. కానీ. తీరా సెమీస్లో టీమిండియా బోల్తా పడగానే మళ్లీ ఓరియో బిస్కెట్లు నెట్టింట వైరల్గా మారాయి. అంతా ఓరియో- MS ధోనీ పిక్స్ షేర్ చేస్తూ వరల్డ్ కప్ ఎక్కడ? అన్నట్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
Oreo For a Reason…#INDvsENG pic.twitter.com/7IwG6nRxei
— Cricpedia (@_Cricpedia) November 10, 2022
Oreo launched in 2011 as well as 2022 – Dhoni
India will win over NZ in finals – ABD
Comedian na kod*kalaraa Indian Cricket Team 😤 pic.twitter.com/Ip0WoHEPx8— 𝐇𝐀𝐍𝐆𝐎𝐕𝐄𝐑 (@_NaveenReddy_14) November 10, 2022
Don’t eat OREO Indians 😓#INDvsENG #ENGvsIND pic.twitter.com/IVS2xSsgOh
— Funk Bro Telugu (@funk__bro) November 10, 2022
Indians watching the match be like : #INDvsENG #Oreo pic.twitter.com/AVn3WaotVG
— krishna (@mufaddal_vodka) November 10, 2022
If Oreo can launch again,
India wins the cup again.#INDvsENG pic.twitter.com/y3MhlzzoJq— Bobby (@bobbyyfederer) November 10, 2022