టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-పాక్ తలపడితే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా! అవును ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ అందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే దాయాది దేశాల మ్యాచ్ అంటే ఎప్పుడూ మజానే. సూపర్-12 దశలో జరిగిన మ్యాచ్ కూడా థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగింది. ఒకానొక దశలో టీమిండియా ఓడిపోతుందని అందరూ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. కానీ కోహ్లీ అద్భుతం చేశాడు. పాత కోహ్లీని గుర్తుచేస్తూ అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు మాత్రం భారత్-పాక్ జట్లు ఫైనల్ ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ జట్టు సెమీస్ లో అడుగుపెడుతుందని కనీసం కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. అంతెందుకు ఆ జట్టులోని ఆటగాళ్లు కూడా అనుకుని ఉండరు. నెదర్లాండ్స్ పుణ్యమా అని పాక్ సెమీస్ లోకి వచ్చేసింది. చాలామంది అనుకున్నట్లుగానే న్యూజిలాండ్ ని ఓడించి, ఫైనల్లో కూడా అడుగుపెట్టేసింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్ల ఆనందానికి అంతులేకుండా పోయింది. దీంతో టీమిండియాతో ఫైనల్ ఆడితే బాగుంటుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పాక్ ఓపెనర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా చెప్పాడు.
‘మా కుర్రాళ్లు(పాక్ క్రికెటర్లు).. ఫైనల్ కు టీమిండియా రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కొందరు.. ఈ టోర్నీని 1992 వరల్డ్ కప్ తో పోల్చి చూస్తున్నారు. దాన్నిబట్టి ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టినా సరే మాకేం ఇబ్బంది లేదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలోనే యాషెస్ సిరీస్ చాలా పెద్దది. కానీ దానికంటే ఇండియా-పాక్ మ్యాచ్ పెద్దది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇంతకంటే ఏం కోరుకోగలను చెప్పండి’ అని మహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఈరోజు ఆడిలైడ్ లో జరగనుంది. చూడాలి మరి ఇందులో గెలిచి, పాక్ తో ఎవరు తలపడతారో?
First fifties in the tournament for Babar Azam and Mohammad Rizwan, that too in a knockout match 👏 #NZvPAK
When it mattered most, these two stepped up 🤜🤛 #T20WorldCup pic.twitter.com/F3uZIzrvDa
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2022