టీ20 వరల్డ్ కప్ లో అదృష్టం కొద్ది పాక్ ఫైనల్ వరకు పోయిందని అందరికి తెలుసు. ఇక పాక్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో.. సొంత ఆటగాళ్లే జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ జింబాబ్వేపై ఒడిపోయనప్పుడే జట్టుపై నిప్పులు చెరిగాడు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్. ఇక ఇప్పుడు ఫైనల్ ల్లో కూడా ఓడిపోవడంతో మరోసారి తన నోటికి పనిచెప్పాడు అమీర్. అసలు పాక్ ఫైనల్ కు పోవడమే గొప్ప విషయమని, నేనసలు టోర్నీ మధ్యలోనే వచ్చేస్తుందనుకున్నానని అమీర్ పాక్ జట్టు పరువుతీసేశాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ నైతే నోటికి వచ్చినట్లు తిట్టాడు. బాబర్ ఓ పిరికిపందగా వర్ణించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్ జట్టు అసలు ఫైనల్ వరకు వెళ్తుందనుకోలేదని, ఏదో లక్కీగా సెమీ ఫైనల్లో గెలిచి ఫైనల్ కు వచ్చారు. మనం ఫైనల్ ఆడటమే గొప్ప విషయం అంటూ పాక్ జట్టుపై విమర్శల వర్షం కురిపించాడు మాజీ పేసర్ మహ్మద్ అమీర్. పాక్ జట్టు ఫైనల్లో ఆడిన తీరుపై అమీర్ మాట్లాడుతూ.. “అసలు పాక్ జట్టుకు ఫైనల్ ఆడే అర్హత ఉందా? మనం ఫైనల్ కు ఎలా వచ్చామో ప్రపంచానికి మెుత్తం తెలుసు. అదృష్టం కొద్దీ తుదిపోరుకు వచ్చాం గానీ.. సెమీస్ లోనే మెుదట బ్యాటింగ్ చేస్తే ఇంటిదారి పట్టేవాళ్లమే” ఘాటుగానే విమర్శించాడు అమీర్. అదీ కాక కెప్టెన్ అనేవాడు మైదానంలో ధైర్యంగా ఉంటూ.. గ్రౌండ్ లో దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో బాబర్ పూర్తిగా విఫలం అయ్యాడు.
బాబర్ ఓ పిరికిపంద.. భయపడుతూ నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే జరుగుతుందని ఈ సందర్బంగా అమీర్ చెప్పుకొచ్చాడు. ఇక మహ్మద్ నవాజ్ కు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని అమీర్ తప్పుపట్టాడు. నవాజ్ మ్యాచ్ విన్నర్ అంటూ పొగిడిన బాబరే.. ఫైనల్లో అతడికి బౌలింగ్ ఇవ్వకుండా పాక్ ఓటమికి కారణం అయ్యాడు బాబర్. పాక్ జట్టు తుది పోరులో ఓటమికి ప్రధాన కారణంగా బాబర్ నిలిచాడని అమీర్ మండిపడ్డాడు. ఏ బౌలర్ ను ఎప్పుడు ఉపయోగించుకోవాలో కెప్టెన్ కు తెలిసి ఉండాలని, అలా తెలియనప్పుడు సారథి జట్టుకు భారంగా మారుతాడని మహ్మద్ అమీర్ విమర్శించాడు. అయితే గత కొంత కాలంగా పాక్ జట్టుపై అలాగే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పై కంటిన్యూస్ గా విమర్శలు గుప్పిస్తున్నాడు మహ్మద్ అమీర్.