టీమిండియా పేసర్ షమీకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించిందని దానిని ఎత్తేయాలంటూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ జీవితం ఎంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందో వ్యక్తిగత కెరీర్ అంత గందరగోళంగా ఉంది. 2014 లో హసీనా జహాన్ తో పెళ్లి అయిన సంగతి తెలిసిందే. వీరి దాంపత్యానికి ఒక పాప. అయితే అంతా సజావుగా సాగుతున్న షమీ జీవితం అనూహ్యంగా 2019 లో అనుకోని మలుపు తిరిగింది. అతని భార్య షమీ తీవ్రంగా వేధిస్తున్నాడని.. అతనికి ఇతర స్త్రీలతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసింది. ఇందుకు గాను షమీ మీద గృహ హింస చట్టం కింద కేసు పెట్టి కూడా పెట్టింది. దీంతో షమీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అవ్వగా.. తన భార్య చేసిన ఆరోపణలన్నీ ఖండిస్తూ వాటిలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో సెషన్స్ కోర్ట్ స్టే విధించడంతో భార్య జహాన్ కలకత్తా హై కోర్ట్ ని సంప్రదించింది. అప్పటినుంచి మూడేళ్ళుగా నడిచిన ఈ కేసుపై జనవరిలో కలకత్తా హై కోర్ట్ తీర్పునిచ్చింది.
ఇందుకు గాను షమీ నెలకు 1.30 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశించింది. వీటిలో 80 వేలు పిల్లల సంరక్షణ కోసం, 50 వేలు భార్య కోసం అని చెప్పింది. అయితే దీనిపై అసంతృప్తిగా ఉన్న షమీ భార్య తనకు నెలకు 10 లక్షల భరణం కావాలని డిమాండ్ చేసింది. అంతే కాదు షమీని అరెస్ట్ చేయకుండా స్టే విధించారని, దాని ఎత్తేయాలంటూ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించింది. కట్నం విషయంలో షమీ నన్ను చాల వేధించాడని, టీమిండియా టూర్లకు వెళ్ళినప్పుడు చాలా మందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తాజాగా షమీపై మరోసారి సంచలన ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. తాజాగా మహ్మద్ షమీపై నమోదైన హత్యాయాత్నం, గృహ కేసులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. షమీపై నమోదైన ఈ కేసు విషయంలో నెల రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుప్రీం కోర్ట్ చీఫ్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఈ మేరకు పశ్చిమ బంగా సెషన్స్ కోర్టుకి గురువారం స్పష్టం చేసింది.