ఆమె సీనియర్ క్రికెటర్. భారత్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. దీంతో ఆమెని స్ట్రెచర్ పై గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
క్రికెట్ చూడటానికి బాగానే ఉంటుంది. బ్యాటర్లు సిక్సులు, ఫోర్లు కొడుతుంటే మజా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలా గాయాల బారిన పడిన క్రికెటర్లు మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు కూడా మహిళల టీ20 వరల్డ్ కప్ సందర్భంగా అలాంటి సంఘటనే జరిగింది. టీమిండియాతో మ్యాచులో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ మైదానంలో కింద పడిపోయింది. దీంతో హుటాహుటిన ఆమెని స్ట్రైచర్ పై ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ లో భారత మహిళా జట్టు పాక్ పై గెలిచి అద్భుత ఆరంభం ఇచ్చింది. వెస్టిండీస్ తో కేప్ టౌన్ వేదికగా రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 118/6 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. రిచా ఘెష్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలర్ దీప్తిశర్మ.. ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ జరుగుతుండగా, 8 ఓవర్ ని రమ్హారాక్ వేసింది. చివరి బంతిని షార్ట్ ఫైన్ దిశగా హర్మన్ కొట్టింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సీనియర్ క్రికెటర్ స్టెఫానీ టేలర్.. బంతిని అందుకుని విసురుదామని ప్రయత్నించింది. పట్టుతప్పి జారిపడటంతో కాలు బెణికింది. దీంతో మైదానంలోనే కుప్పకూలింది. పైకి లేవడానికి తెగ ఇబ్బంది పడేసరికి మెడికల్ సిబ్బంది వచ్చిన ఆమెని స్ట్రైచర్ పై ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తర్వాత మ్యాచ్ ఆడేది లేనిది తెలియాల్సి ఉంది. మరి భారత్ తో మ్యాచ్ లో విండీస్ క్రికెటర్ గాయపడటంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
🚨Medical Update🚨
Stafanie Taylor is being evaluated by the match medical team and a further update will be given when more information is known.#T20WorldCup | #MaroonWarriors pic.twitter.com/ExDWSC9I2K— Windies Cricket (@windiescricket) February 15, 2023