ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అనగానే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ బీసీసీఐ. ఓవైపు ఇంటర్నేషనల్ మ్యాచులు, మరోవైపు దేశవాళీ మ్యాచులు నిర్వహిస్తూనే.. ప్రతి ఏడాది ఐపీఎల్ ని సక్సెస్ ఫుల్ గా ఆర్గనైజ్ చేస్తూ వస్తోంది. వేల కోట్లు ఆర్జిస్తూనే ఉంది. అయితే గతంతో పోలిస్తే.. కరోనా తర్వాత మన లైఫ్ స్టైల్ మారినట్లే.. క్రికెట్ మ్యాచులు చూసేవారి తీరు చాలావరకు మారిపోయింది. ఇలాంటి టైంలో బీసీసీఐకి స్టార్ స్పోర్ట్స్ సంస్థ రిక్వెస్ట్ పెట్టుకుంది. తమకు ఏకంగా కోట్ల రూపాయల డిస్కౌంట్ కావాలని అడిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక జట్టు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తవగా.. మంగళవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్ లతో స్టార్ స్పోర్ట్స్ కు నష్టం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సిరీస్ కు సంబంధించి యాడ్ ఇన్వెంటరీ సేల్ కాలేదని, యాడ్స్ కోసం కేవలం మూడు, నాలుగు బ్రాండ్స్ మాత్రమే వచ్చాయని ఇన్ సైడ్ స్పోర్ట్స్ ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. స్వయంగా స్టార్ స్పోర్ట్స్ అధికారే.. భారత్-శ్రీలంక సిరీసుల వల్ల రూ.200 కోట్ల నష్టం వచ్చినట్లు తమతో చెప్పారని ఆ కథనంలో పేర్కొంది.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీకి కూడా ఒక్క యాడ్ కూడా రాలేదట. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ తమ డీల్ లో రూ.130 కోట్లు డిస్కౌంట్ ని అడిగిందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక జెర్సీ స్పాన్సర్ బైజూస్ కూడా తన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుంటామని బోర్డుకు సమాచారమిచ్చింది. దీంతో సోమవారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగింది. ‘బైజూస్, స్టార్ ఇండియాలు అడిగిన దానిపై అపెక్స్ మీటింగ్ లో డిస్కస్ చేశాం. కానీ ఇంకా ఫైనల్ డెసిషన్ ఏం తీసుకోలేదు. కోట్లతో కూడిన వ్యవహారం కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కాస్త టైం పట్టొచ్చు’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా 2018-23 కాలానికి గానూ దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచుల హక్కుల కోసం స్టార్ స్పోర్ట్స్.. రూ.6138.1 కోట్లకు ఒప్పందం చేసుకుంది. కానీ కరోనా తర్వాత చాలా మ్యాచులు రీషెడ్యూల్ కావడం వల్లే నష్టాలొచ్చాయని స్టార్ సంస్థ పేర్కొంది. అందుకే మొత్తం నుంచి రూ.130 కోట్ల డిస్కౌంట్ అడుగుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.