టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. అంతే కాకుండా ఒక అద్భుతమైన బ్యాటర్, కీపర్తో పాటు విలువైన ఫినిషర్. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ధోని క్రీజ్లో ఉన్నాడంటే ప్రశాంత గుండెలపై చేయి పెట్టుకుని ఉండొచ్చు. కెప్టెన్ కాకముందు తన పవర్హిట్టింగ్ బ్యాటింగ్తో ధోని అందరిని ఆకర్షించాడు. హెలికాప్టర్ షాట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. టీమ్లోకి వచ్చిన అనతి కాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్మురేపాడు. కేవలం 31 వన్డే మ్యాచ్లు ఆడి ప్రపంచ నంబర్ వన్ క్రికెటర్గా మారిపోయాడు. చాలా ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది.
ఇప్పుడు మరో టీమిండియా యువ క్రికెటర్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. అతడే మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్. తాజాగా సిరాజ్ వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. 729 పాయింట్లతో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజల్వుడ్ను వెనక్కినెట్టి.. ఐసీసీ ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్గా ఎదిగాడు. అయితే.. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో, అలాగే ఐపీఎల్లోనూ భారీ పరుగులు ఇచ్చుకుంటున్నాడంటూ.. సిరాజ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చేవి. చాలా రోజులు క్రికెట్ అభిమానులు సిరాజ్ను దారుణంగా ట్రోల్ చేశాడు. ఈ అవమానుల నుంచి రాటుదేలిన సిరాజ్.. ఎప్పటికప్పుడు తనని తాను మెరుగుపర్చుకుంటూ వచ్చాడు. భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్ మ్యాచ్ విన్నర్లు ఉన్న సమయంలోనే టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా చెలరేగాడు. కీలక బౌలర్లు గాయపడటంతో కేవలం రెండో మ్యాచ్తోనే భారత పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాడు.
టెస్టు క్రికెట్లో రెగ్యులర్ బౌలర్గా మారిన సిరాజ్.. ఇప్పుడు వన్డేల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. బుమ్రా లేని లోటును ఏ మాత్రం కనిపించనీయకుండా చేస్తూ.. ఇండియన్ టీమ్కు మెయిన్ బౌలర్గా మారిపోయాడు. ముఖ్యంగా పవర్ప్లేలో కచ్చితంగా వికెట్ అందిస్తూ.. జట్టుకు అవసరమైనప్పుడు కీలక బ్రేక్త్రూలు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వన్డే క్రికెట్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్గా ఎదిగాడు. అయితే.. ఇప్పటికే వరకు కేవలం 21 వన్డేలు మాత్రమే ఆడిన సిరాజ్ ఈ ఘనత సాధించాడు. గతంలో ధోని 38 వన్డే మ్యాచ్లు ఆడి ఐసీసీ ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో నంబర్ స్థానం సాధిస్తే.. సిరాజ్ కేవలం 21 మ్యాచ్లతోనే బౌలింగ్ విభాగంలో ఐసీసీ నంబర్ వన్ ర్యాంక్కు వచ్చాడు. 2006లో ధోని వరల్డ్ నంబర్వన్గా ఉన్నాడు. ఇలా అతి తక్కువ మ్యాచ్లు ఆడి.. ఐసీసీ ర్యాంకింగ్స్లో ఏ విభాగంలోనైనా నంబర్ వన్ స్థానం సాధించిన ప్లేయర్గా సిరాజ్ నిలిచాడు. మరి సిరాజ్.. ధోని వరల్డ్ రికార్డు బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Siraj just took 21 Innings to be the No.1 bowler in ODI Rankings 🪄🔥#MohammedSiraj #MSDhoni #ICCRankings pic.twitter.com/ChkhI0t9bM
— CricketGully (@thecricketgully) January 25, 2023