క్రికెట్ లో కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకొస్తున్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. ఈ నిబంధనల వల్ల క్రికెట్.. బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారుతున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే ఆట దాని సహజత్వాన్ని కోల్పోతుందని అంటున్నారు మాజీ ఆటగాళ్లు. క్రికెట్ అంటే బ్యాటుకు బంతికి మధ్య జరిగే పోరు. ఈ పోరు అనేది సమానంగా ఉన్నప్పుడే ఆటలో మజా ఉంటుందంటున్నారు అభిమానులు. తాజాగా ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ స్పందించాడు. ఈ రోజుల్లో క్రికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోయిందని .. ప్రస్తుతం క్రికెట్లో అమలుచేస్తున్న నిబంధనలు తాము ఆడిన రోజుల్లో గనుక ఉండి ఉంటే సచిన్ లక్ష పరుగులు చేసేవాడు అని అన్నారు.
ఇది కూడా చదవండి : ఏబీడీ లోటును భర్తీ చేసేందుకు ముంబై క్రికెటర్ పై కన్నేసిన ఆర్సీబీ
ఈ విషయంపై అక్తర్ స్పందిస్తూ.. “నేను సచిన్ పై నిజంగా జాలిపడుతున్నాను. సచిన్పై జాలిపడటానికి కారణం అతను మొదట్లో వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్వంటి దిగ్గజ క్రికెటర్లతో ఆడాడు, తర్వాత బ్రెట్ లీ, మెక్ గ్రాత్, నాతో.. తరువాత తరంలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లను కూడా ఎంతో సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. అందుకే అతన్ని చాలా టఫ్ బ్యాట్స్మెన్ అని పిలుస్తాను” అంటూ సచిన్ పై ప్రశంసలు కురిపించాడు అక్తర్. ప్రస్తుతం ఐసీసీ అమలుచేస్తున్న మూడు రివ్యూలు సిస్టమ్ నిబంధన గనుక తాము ఆడిన రోజుల్లో ఉండి ఉంటే సచిన్ టెండూల్కర్.. క్రికెట్లో లక్ష పరుగులు చేసేవాడని అన్నాడు. ఈ రోజుల్లో క్రికెట్ బ్యాటింగ్ ఆధారిత క్రీడ అయిపోయిందని, కానీ బ్యాటర్ గా ఫాస్ట్ బౌలర్ బౌన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నప్పుడే బ్యాట్స్మన్ ఆటను బాగా ఎంజాయ్ చేస్తారని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఇదే విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. బ్యాట్, బాల్ మధ్య ఆసక్తికరమైన పోరు ఉంటేనే ఆటలో మజా ఉంటుందని అన్నాడు. ఒకవేళ ఆ బ్యాలెన్స్ ను ఐసీసీ చేయదలిస్తే.. “ ఓవర్ను 2 బౌన్సర్లకు పరిమితం చేయకూడదు. వాటిని పెంచండి అంటూ ఐసీసీ కి సూచనలు చేశాడు. మరి సీనియర్ క్రికెటర్స్ ఇస్తున్న ఈ సూచనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.