భారత్ క్రికెట్లో ఎన్నో హాస్యాస్పద విషయాలు జరుగుతున్నాయని ఒక సీనియన్ క్రికెటర్ వాపోయాడు. డొమెస్టిక్ ప్లేయర్ల ఎంపిక విషయంలో సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు అని ఆయన చెప్పాడు.
క్రికెట్లో అవకాశాలు రావడం అనేది ఎంత కష్టమనేది తెలిసిందే. ఎంత ప్రతిభ కలిగిన ప్లేయర్కు అయినా అంత సులువుగా ఛాన్స్ రాదు. అందులోనూ భారత్ లాంటి క్రికెటింగ్ దేశాల్లో ఒక్క ప్లేస్ కోసం కూడా ఎంతో తీవ్ర పోటీ ఉంటుంది. వందలు, వేలాది మంది టాలెంటెడ్ ప్లేయర్లను దాటుకొని రంజీలు, నేషనల్ టీమ్కు ఎంపికవ్వాలంటే కష్టమే. అయితే ఇదంతా సెలెక్టర్ల చేతుల్లోనే ఉంటుంది. ప్రతిభ కలిగిన ప్లేయర్లను వాళ్లే గుర్తించాలి. ఫస్ట్క్లాస్ లెవల్లో రాణిస్తున్న ఆటగాళ్లను తీసుకొని సానబెట్టాలి. నేషనల్ టీమ్కు ఎప్పటికప్పుడు యువ ప్లేయర్ల రూపంలో నయా రక్తాన్ని నింపుతూ ఉండాలి. అయితే మన సెలెక్టర్లు ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నారని ఎంతో మంది సీనియర్లు విమర్శిస్తున్నారు. ఇటీవలే దినేష్ కార్తీక్ భారత సెలెక్షన్ కమిటీపై మండిపడ్డాడు. దులీప్ ట్రోఫీకి తమిళనాడుకు చెందిన బాబా ఇంద్రజీత్ను తీసుకోకపోవడంపై డీకే సీరియస్ అయ్యాడు.
ఈ సంవత్సరం మార్చిలో రెస్టాఫ్ ఇండియాకు కూడా ఆడిన ఇంద్రజీత్ను.. దులీప్ ట్రోఫీలో పాల్గొనే సౌత్ జోన్ టీమ్లోకి తీసుకోకపోవడంపై డీకే ఫైర్ అయ్యాడు. తాజాగా సెలెక్టర్లపై మరో సీనియర్ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. అతడే వెటరన్ పేసర్ వెంకటేష్ ప్రసాద్. కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఆయన మండిపడ్డాడు. ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీయడంతో పాటు ఇండియా-ఏకు ఆడిన అనుభవం ఉన్న సక్సేనాను సెలెక్ట్ చేయకపోవడం సరికాదని ఆయన విమర్శించాడు. భారత క్రికెట్ను చూస్తుంటే నవ్వొస్తోందన్నాడు. రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ను సెలెక్ట్ చేయకపోవడం మనకు సిగ్గుచేటని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీని పనికి రాకుండా చేశారని వెంకటేష్ ప్రసాద్ ఫైర్ అయ్యాడు.
There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81
— Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023