ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ మొదలుకానుంది. ఆ మరుసటి రోజే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టీ20 ప్రపంచకప్-2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో ‘ఏ జట్టుకు ఆసియా కప్ గెలిచే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్న ప్రశ్నకు..’ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జోస్యం చెప్పాడు. ఆ జట్టేదే.. ఇప్పుడు చూద్దాం..
ఆసియా కప్ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా అన్న ప్రశ్నపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సరదాగా స్పందించాడు. ఖచ్చితంగా టీమిండియాదే ట్రోఫీ అన్న అతడు.. వాళ్లకేమైనా విటమిన్లు తక్కువయ్యాయా అంటూ చమత్కరించాడు. “గత కొన్ని రోజులుగా ఇండియా అద్భుతంగా ఆడుతోంది. జట్టులో చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం వారికుంది. కాబట్టి వారినే చాలా మంది ఫేవరెట్లుగా పేర్కొంటున్నారు’’ అని తెలిపాడు. ఈ టోర్నీకి ఎంపిక చేసిన స్క్వాడ్ పటిష్టంగా ఉందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఇక పాకిస్తాన్ విజయావకాశాల గురించి మాట్లాడుతూ.. “పాకిస్తాన్ జట్టు తనదైన రోజు చెలరేగి ఎవరినైనా ఓడించగలదని అందరికీ తెలుసు. టీ20 ఫార్మాట్లో మెరుగైన భాగస్వామ్యాలే కీలకం. అయితే, ఆరోజు పరిస్థితి ఎలా ఉందన్న అంశం మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అంతేకాదు.. అఫ్గనిస్తాన్ను కూడా తక్కువగా అంచనా వేయలేం” అని పేర్కొన్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేష్ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.
స్టాండ్బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
ఇదీ చదవండి: దేశం పేరు మార్చండి! ప్రధాని మోదీకి షమీ మాజీ భార్య రిక్వెస్ట్
ఇదీ చదవండి: అతను చెప్పేంత వరకు సచిన్ గురించి నాకు తెలియదు: అక్తర్