సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో దుమ్మురేపిన టీమిండియా జట్టు.. వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యువ టీమిండియా శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగింది. కానీ అనూహ్యంగా తొలి వన్డేలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలుస్తారని అభిమానులు ఆశించారు. దానికి కారణం అందరూ.. టీ20లు, ఐపీఎల్ ల్లో సత్తా చాటిన కుర్రాళ్లే అవ్వడం. కానీ ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్సే.. అని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. అతడు టెస్ట్ అనుకుంటున్నాడా? వన్డే అనుకుంటున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రుతురాజ్ గైక్వాడ్.. కచ్చితమైన టెమింగ్ షాట్స్.. స్టోక్ ప్లేతో తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించాడు. ఈ క్రమంలోనే 2016-17 కాలంలో విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. దాంతో ఒక్కసారిగ పాపులర్ అయ్యాడు. ఇక అతడి ఆటను గమనించిన ధోని.. అతడిని 2019 IPL వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసేలా పావులు కదిపాడు. పావులు కదపడమే కాకుండా అతడికి ప్రత్యేకంగా బ్యాటింగ్ పాఠాలను సైతం నేర్పాడు. గత ఐపీఎల్ లో రుతురాజ్ తన విశ్వరూపాన్నే చూపాడు. IPL 2021లో 16 మ్యాచ్ ల్లో ఓ శతకంతో సహా 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో ధోని శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఈ ప్రదర్శనతోనే తాజాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియాకు ఎంపికయ్యడు. ఇక తన తొలి వన్డేలో అత్యంత చెత్త ప్రదర్శన చేసి.. టీమిండియా ఓటమికి కారణం కూడా అయ్యి.. నెటిజన్స్ నుంచి విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్ లో రుతురాజ్ 42 బంతులు ఎదుర్కొన్ని కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. రుతురాజ్ 19 రన్స్ కు 42 బాల్స్ ఆడటంతో.. సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరిగి మిగతా బ్యాటర్లపై ఆ ఒత్తిడి పడింది. ఇక సంజూ శాంసన్ చివరి వరకు గట్టిగానే పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రుతురాజ్ అన్ని బాల్స్ ఆడకుండా ఉండి ఉంటే.. సంజూ.. మ్యాచ్ ను ఎప్పుడో ముంగించి ఉండేవాడని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
రుతురాజ్ పై భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ లో తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేస్తావ్? ఇక్కడేమైంది? ఇది టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నావా? ఏంటి? అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో బాగా డబ్బులు వస్తాయి కాబట్టి ఆడావా? అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ స్ట్రైక్ రేట్ 45.24 ఉండగా.. ఇదే IPLలో అయితే 130 ఉంది. అయితే ఐపీఎల్ ల్లో సైతం రుతురాజ్ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కొవడం పెద్ద విషయం ఏమీ కాదు. అయినప్పటికీ తన అరంగ్రేటర మ్యాచ్ లోనే విమర్శలు ఎదుర్కొవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో రుతురాజ్-ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి 80 బంతులు ఎదుర్కొని కేవలం 39 పరుగులు మాత్రమే చేశారు.
Ruturaj Gaikwad 19 (42ball)
Ishan Kishan 20(36ball)
Future Indian openers🤬 pic.twitter.com/Hn5TEhjRj9
— Hʏᴘᴇᴅ Fᴏʀ Nᴏᴛʜɪɴɢ (@Mr__AAD) October 6, 2022
Ishan Kishan, Ruturaj Gaikwad played for to just Secured there place..
Ishan Kishan #Ruturaj Gaikwad
Lord Shardul Thakur #SanjuSamson
#IndvsSAodi pic.twitter.com/eOm0DpDPgg— Vaibhav D (@Vaibhav04563161) October 6, 2022
Ruturaj Gaikwad, just like his selfish FC( reference to CSK FC) , played a really selfish innings pic.twitter.com/dcoOj6L7zx
— Ayush (@AyushAman22) October 6, 2022