సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మధ్య మధ్యలో ఆ జట్టు కెప్టెన్ ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం సహజమే. ఇలాంటి సలహాలు అందివ్వడంలో ధోని సిద్దహస్తుడని మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి టీం దీనిపై అభ్యంతరాన్ని తెలుపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఆ సూచనలే మ్యాచ్ విజయాన్ని మారుస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటనే భారత్-పాక్ మ్యాచ్ లో జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీమిండియాకు చివరి రెండు ఓవర్లలో 21 రన్స్ కావాలి. ఈ క్రమంలో 19వ ఓవర్ వేసేందుకు పాక్ పాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ వచ్చాడు. ఈ ఓవర్ తొలి బాల్ కు పాండ్య సింగిల్ తీశాడు. దాంతో స్ట్రైక్ లోకి వచ్చిన జడేజా తన చేతి గ్లోవ్స్ స్వెట్ తో తడిచాయని మార్చుకుంటానని అంపైర్ తో చెప్పాడు. కానీ అంపైర్ ఓవర్ మధ్యలో ఇలా వెల్లడానికి నిబంధనలు అనుమతించవు అని చెప్పాడు. కానీ జడేజా అంపైర్ మాటలు వినకుండా రిషబ్ పంత్ ను, రవి బిష్ణోయ్ లను పిలిచాడు.
ఈ క్రమంలో రిషబ్ పంత్ చెవిలో రోహిత్ శర్మ ఒక విషయాన్ని చెప్పాడు. ఇక గ్లోవ్స్ అందించే క్రమంలో రిషబ్ పంత్ రోహిత్ చెప్పిన విషయాన్ని జడేజా చెవిలో పడేశాడు. ఈ విషయాన్ని గమనించిన పాక్ కెప్టెన్ బాబార్ దీనిపై అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. ఇక అసలు విషయం ఏంటంటే పాక్ తన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ ను స్పిన్నర్ మహ్మద్ నవాబ్ వేయనున్నట్లు రోహిత్ పంత్ చెవిలో చెప్పాడు.
అదే విషయాన్ని పంత్ జడేజా కు చెప్పాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రవి బిష్ణోయ్ గ్లోవ్స్ అందిస్తుంటే జడ్డూ తీసుకోలేదు. పంత్ ద్వారా మాత్రమే వాటిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఇక రోహిత్ ప్లాన్ వర్కౌట్ కావడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆసక్తికరమైన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Sagar (@disagar_) August 29, 2022