క్రికెట్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. కోట్ల మంది క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అదృష్టం కొద్ది టికెట్లు దొరికినవారు స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షిస్తారు. అంతటి క్రేజ్ ఉన్న మ్యాచ్లు చాలా కాలంగా కేవలం ప్రపంచ కప్ వేదికలపై మాత్రమే జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న వైరం కారణంగా ద్వైపాక్షి సిరీస్లు జరగడంలేదు. ఈ లోటును భర్తీ చేసి.. క్రికెట్ ఫ్యాన్స్కు ఆనందం పంచేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఒక వినూత్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
Hello fans.Will propose to the ICC a Four Nations T20i Super Series involving Pak Ind Aus Eng to be played every year,to be hosted on rotation basis by these four. A separate revenue model with profits to be shared on percentage basis with all ICC members, think we have a winner.
— Ramiz Raja (@iramizraja) January 11, 2022
భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో టీ20ఐ సిరీస్ను ప్రతి ఏడాది నిర్వహించాలని ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందుకు ఓ ప్రతిపాదనను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సిరీస్కు రోటేషన్ పద్దతిలో ఒక్కో ఏడాదిఓ ఒక్కో దేశం అతిథ్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సిరీస్ జరిగితే వచ్చే లాభాలను నాలుగు జట్లు పంచుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మరి ఈ ప్రతిపాదనపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రమీజ్ రాజా ప్రతిపాదనపై భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి రమీజ్ రాజా ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Would you like to see this happen? pic.twitter.com/GRaGaAafqf
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2022