ఒలింపిక్స్ అంటే అథ్లెట్లకు ఎంతో ప్రత్యేకం. పతకం సంగతి పక్కన పెడితే కొందరైతే పాల్గొంటే చాలు అన్న భావనతో ఉంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొని సాధించిన పతకాన్ని ఆమె ఎందుకు వేలం వేసింది?. అసలు ఎందుకు ఆ పరస్థితి వచ్చింది?.
విషయానికొస్తే, ఐదేళ్ల కఠోర శ్రమ తర్వాత సాధించిన పోలండ్కు చెందిన అథ్లెట్ ఆండ్రెజిక్ టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్లో 64.61 మీటర్ల త్రోతో రజతం సాధించింది. రియోలో నాలుగోస్థానంలో నిలిచిన ఆండ్రెజిక్కు ఇది ఎంతో ప్రత్యేకమైన పతకం. కానీ, అలాంటి పతకాన్ని అపురూపంగా చూసుకోకుండా ఆమె వేలానికి పెట్టింది. ఓ ఎనిమిది నెలల చిన్నారి గుండె కోసమే ఆమె ఎన్నో సంవత్సరాల శ్రమను వేలానికి పెట్టింది. ఓ ఎనిమిది నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతున్నట్లు తెలుసుకన్న ఆండ్రెజిక్సాయం చేయాలనుకుంది. చిన్నారికి శస్త్రచికిత్స చేయించడానికి పూనుకుంది.
పోలాండ్కు చెందిన అబ్కా కన్వీనియెన్స్ స్టోర్ కంపెనీ మరియా ఆండ్రెజిక్ పతకాన్ని 1,25,000 డాలర్లకు దక్కించుకుంది. పతకం సొంతం చేసుకున్న సంస్థ అసలు విషయాన్ని తెలుసుకుని మెడల్ను మరియాకు తిరిగి ఇచ్చేసింది. ఆ కంపెనీ తన ఉదారతను చాటుకుంది. చిన్నారి గుండె ఆపరేషన్కు కావాల్సిన డబ్బు తామే ఇస్తామని కన్వీనియెన్స్ స్టోర్ ప్రకటించింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపుతున్న ఆ పిసివాడి పేరు మిలోస్జెక్ అని మరియా తెలిసింది. విరాళాలు సేకరించడం నాకు ఇదే మొదటిసారి. అందుకే వేలం వేయడమే నాకు సరైందని అనిపించిందని మరియా చెప్పింది. మరియా గెలిచింది రజతమే అయినా.. ఆమె హృదయం మాత్రం బంగారం అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.