రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రాణ భయంతో ఉక్రెయిన్ నుంచి వేలాది మంది ప్రజలు పారిపోయి పక్కదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ పై దాడిని రష్యా దేశంలోని కొందరు ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా రష్యన్ జర్నలిస్టు దిమిత్రి మురటోవ్ ఉక్రెయిన్ శరాణార్థుల కోసం నోబెల్ బహుమతిని వేలంలో పెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. రష్యన్ జర్నలిస్టు అయిన దిమిత్రి మురటోవో ప్రముఖ రష్యన్ దినపత్రిక నోవయా గెజెటా కు ఎడిటర్. ఈయన జర్నలిస్టుకు విశేషమైన కృషి చేశాడు. అందుకుగానూ గత ఏడాది ఫిలిప్పైన్స్కు చెందిన మారియా రెసాతో కలిసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ముందు నుంచి ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను మురటోవ్ ఖండిస్తూ వచ్చాడు.
దాదాపు 35 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో పారిపోయి వివిధ దేశాలలో శరణార్థులుగా కాలం వెళ్లదీస్తున్నారు. వారికి సహయం చేసేందుకు దిమిత్రి.. తన నోబెల్ గోల్డ్ మెడల్ను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. తన నోబెల్ను వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని శరణార్థులకు సదుపాయాలు కల్పించడానికి వినియోగిస్తానని వెల్లడించారు. రష్యా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అధికార పత్రికలు మాత్రమే అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నాయని, వేలం ఈవెంట్ను తమ పత్రికలో ప్రచురించలేకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.మరి.. దిమిత్రి మురటోవ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.