రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రాణ భయంతో ఉక్రెయిన్ నుంచి వేలాది మంది ప్రజలు పారిపోయి పక్కదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ పై దాడిని రష్యా దేశంలోని కొందరు ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా రష్యన్ జర్నలిస్టు దిమిత్రి మురటోవ్ ఉక్రెయిన్ శరాణార్థుల కోసం నోబెల్ బహుమతిని వేలంలో పెట్టాడు. […]