తమ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ ను చూడ్డానికి అభిమానులు ఎంత దూరమైన వెళ్తారు. అయితే క్రికెట్ పై ఉన్న పిచ్చి ప్రేమతో చెట్లపైకి ఎక్కి తమ ప్రాణాలను పనంగా పెట్టి మ్యాచ్ చూశారు ఓ దేశానికి చెందిన క్రికెట్ అభిమానులు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రపంచ క్రికెట్ లో క్రికెట్ ను అమితంగా ఇష్టపడే దేశాల్లో మెుదటి స్థానంలో ఉంటుంది ఇండియా. ఇక భారత్ లో క్రికెట్ అయినా.. సినిమా అయినా అభిమానం ఎప్పుడు తారాస్థాయిలో ఉంటుంది. తమ అభిమాన క్రికెటర్ల మ్యాచ్ ను చూడ్డానికి అభిమానులు ఎంత దూరమైన వెళ్తారు. అయితే ఈ దేశంలో క్రికెట్ పై ఉన్న ప్రేమను చూస్తే.. ఇండియాకు క్రికెట్ పై ఉన్న అభిమానం తక్కువే అన్న ఆలోచన కలగకమానదు. క్రికెట్ పై ఉన్న ప్రేమతో చెట్లపైకి ఎక్కి తమ ప్రాణాలను పనంగా పెట్టి మ్యాచ్ చూశారు. ఇంతకీ ప్రాణాలను పనంగా పెట్టి క్రికెట్ చూసిన అభిమానుల దేశం ఏది అనుకుంటున్నారా? మన పొరుగుదేశమే.. అంటే పాకిస్థాన్ అనుకుంటారేమో కాదండీ బాబు.. నేపాల్! అవును గత కొంతకాలంగా నేపాల్ లో క్రికెట్ పై అభిమానం గణంగా పెరిగింది. తాజాగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా తాజాగా యూఏఈ వర్సెస్ నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడ్డం కోసం అక్కడి క్రికెట్ అభిమానులు ప్రాణాలను కూడా లెక్కచేయలేదు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2(2019-23) లో భాగంగా గురువారం నేపాల్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు నేపాల్ లోని కిర్తీపూర్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవడానికి ఇది నేపాల్ కు కీలక మ్యాచ్ కావడంతో నేపాల్ క్రికెట్ అభిమానలు ఈ మ్యాచ్ ను చూడ్డానికి పోటెత్తారు. స్టేడియం మెుత్తం ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ఇక టికెట్లు దొరకని వారు గ్రౌండ్ అవతల నుంచి, బారికేడ్లు ఎక్కి ఈ మ్యాచ్ ను వీక్షించారు. ఈ క్రమంలోనే మరికొందరు అభిమానులు అయితే మ్యాచ్ బాగా కనపడాలని ఏకంగా చెట్లను ఎక్కి మ్యాచ్ చూశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో క్రికెట్ పై ఎంత అభిమానం ఉంటే ఇలా చూస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ లీగ్ మ్యాచ్ లను చూడ్డానికి, తమ జట్టును ఎంకరేజ్ చేయడానికి అభిమానులు మెుదటి నుంచి స్టేడియాలకు పోటెత్తుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలను వమ్ము చేయకుండా నేపాల్ జట్టు ఈ కీలక మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్ లీగ్ కు అర్హత సాధించడానికి ముందుకెళ్లింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో చిచ్చర పిడుగు ఆసిఫ్ ఖాన్ కేవలం 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు హోం గ్రౌండ్ లో చెలరేగింది. 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ కు అంతరాయం కలిగించడం, వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్దతిని అమలు చేశారు. ఇక డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 9 పరుగులతో నేపాల్ విజయం సాధించింది. జట్టులో బీమ్ షార్కీ (67), ఆరిఫ్ షేక్(52), గుల్షన్ జా(50*), కుషాల్ బుర్తెల్(50) పరుగులతో రాణించారు. ఇక తమ దేశం వరల్డ్ కప్ లో ఆడాలి అన్న నేపాల్ అభిమానుల ప్రేమే ఇప్పడు వారిని వరల్డ్ కప్ లో ముందుకు తీసుకెళ్లింది. మరి ఎంత అభిమానం ఉంటే ఆ క్రికెట్ ప్రేమికులు ఇలా చెట్లు ఎక్కి మ్యాచ్ ను చూస్తారు చెప్పండి. మరి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నేపాల్ అభిమానులు చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
एउटा गतिलो स्टेडियम बनाउन नसक्नेहरु किन खेल हेर्न मैदान पुगेका!? यो तस्वीरले गिज्याउँदैन!? लज्जित बनाउँदैन!? अन्तर्राष्ट्रिय मिडियाले कभर गरिरहेका छन् यहाँ!! pic.twitter.com/Cm6hHcAzPG
— Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) March 16, 2023
मैदान बाहिर यत्रो भिड, निश्वार्थ प्रेम र लगाव।💚#NEPvUAE , #nepalcricket , #nepalvsuae pic.twitter.com/UyL8DEfM99
— Nirmal Prasai🇳🇵 (@NirmalPrasai5) March 16, 2023