టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ గురించి తెలిసిందే. క్రీజులోకి దిగాడంటే అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. అదే సమయంలో అవసరమైతే తనదైన శైలిలో డిఫెన్స్ చేస్తూ, కళాత్మక షాట్లతోనూ అలరిస్తాడు. ధోని ఆడిన అలాంటి ఓ ఇన్నింగ్స్ను ఫ్యాన్స్ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్లేయర్గా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ధోని.. సారథిగా అన్ని ఫార్మాట్లలోనూ భారత్ను నంబర్ వన్గా నిలిపాడు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్ కప్తో పాటు టీ20ల్లోనూ దేశానికి ప్రపంచ కప్ను అందించాడు. ఇక, ఐపీఎల్లో అతడి సక్సెస్ రేటు, ట్రీఫీల చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. అలాంటి ధోని కెరీర్లో మర్చిపోని ఇన్నింగ్స్ ఒకటి ఉంది. ఒకరకంగా అతడి టెస్టు కెరీర్లో అదే టాప్లోనూ నిలవొచ్చు. అదే ఆస్ట్రేలియా మీద 2013లో చెన్నైలో ఆడినది. ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్ తొలి టెస్టులో మహేంద్రుడు విధ్వంసకర ఇన్నింగ్స్తో కంగారూలను కంగారెత్తించాడు.
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 380 రన్స్ చేసింది. ఆ జట్టులో కెప్టెన్ మైకేల్ క్లార్క్ (130) సెంచరీతో చెలరేగాడు. మొయీస్ హెన్రిక్స్ (68) అతడికి మంచి సహకారం అందించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (59) కూడా ఫర్వాలేదనిపించాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లతో అదరగొట్టాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్తో ఆసీస్ వెన్నువిరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (107) శతక్కొటాడు. సచిన్ టెండూల్కర్ (81) కూడా రాణించాడు. ఇక, ధోని అయితే ఏకంగా (224) డబుల్ సెంచరీతో చెలరేగాడు దీంతో భారత్ 572 రన్స్ చేయగలిగింది.
ఇండియా బ్యాటింగ్లో ఎంఎస్ ధోని ఆడిన కెప్టెన్సీ ఇన్నింగ్స్ సూపర్బ్ అనే చెప్పాలి. 196 రన్స్కు 4 వికెట్ల పడిన దశలో అతడు సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లను ఫోర్లు, సిక్సులతో ఊచకోత కోశాడు. ధోని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్తో భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి, ఏకైక వికెట్ కీపర్గా ధోని నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 241 రన్స్కే ఆలౌట్ అయింది. అశ్విన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగాడు. 49 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ మ్యాచ్ విజయంలో ధోని పాత్ర ఎంతో ఉంది. ఈ ఇన్నింగ్స్కు పదేళ్లు పూర్తవుతుండటంతో మాహీ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. మరి.. ధోని డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ మీకూ గుర్తుందా, ఆ రోజు ధోని ఎలా ఆడాడనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
On this day in 2013 – MS Dhoni created history becoming the first & only Indian Wicket-keeper to score a double Hundred in Test.
India was 196 for 4 & then smashed 224 runs from 265 balls including 24 fours & 6 sixes vs Australia.pic.twitter.com/iZrecArlyU
— Johns. (@CricCrazyJohns) February 24, 2023