ఎంఎస్ ధోనీ.. కెప్టెన్ గా టీమిండియాకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. ఒక్క క్రికెటర్ గానే కాకుండా అతని వ్యక్తిత్వానికే లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. ఇంక ధోనీ ఆట విషయానికి వస్తే.. క్రికెట్ ప్రపంచంలో కోట్ల మంది అభిమానులు ధోనీ సొంతం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ధోనీది అని అందరికీ తెలిసిందే. ఒక సెలబ్రిటీ అనే గర్వం, అహంకారం లాంటివి లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు. అప్పుడప్పుడు తన వీరాభిమానులను కలుస్తూ వారి కల నెరవేరుస్తుంటాడు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా రాంచీ విమానాశ్రయంలో జరిగింది.
ధోనీ చెన్నై వెళ్లేందుకు రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ అతడిని కలిసేందుకు ఓ ప్రత్యేక అభిమాని ఎదురుచూస్తున్న విషయం ధోనీ దృష్టికి వచ్చింది. వెంటనే ధోనీనే స్వయంగా వెళ్లి ఆ అభిమానిని కలిశాడు. తనని కలవాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లావణ్య అనే అభిమానిని కలిసి ఆమె చిరకాల కల నెరవేర్చాడు ధోనీ. మే 31న ఈ సంఘటన జరగ్గా.. చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా ఫొటోలను షేర్ చేసింది.
King of 💛s who spreads Yellove #EverywhereHeGoes!#Thala #WhistlePodu 🦁 pic.twitter.com/La2YCDlbzD
— Chennai Super Kings (@ChennaiIPL) May 31, 2022
అంగవైకల్యంతో బాధపడుతున్న 15 ఏళ్ల లావణ్య పిలానియా.. అందరిలా నడవలేదు. ఆమె వీల్ చైర్ కే పరిమితమై జీవనం సాగిస్తోంది. ఆమె ఎంఎస్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద అభిమాని. ఐపీఎల్ లో చెన్నై మ్యాచ్ ఉందంటే అస్సలు టీవీ వదలదు. ధోనీని కలిసిన ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ధోనీని కలిసిన ఫొటోలు షేర్ చేసింది. వారి మధ్య జరిగిన సంభాషణను ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.
‘ధోనిని కలిసినప్పటి క్షణాలను నేను మాటల్లో వివరించలేను. ఆయన చాలా మంచివాడు, మృధు స్వభావి, ఎంతో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. నా పేరు స్పెల్లింగ్ అడగండ, నా చేయి పట్టుకుని ఏడవకు అంటూ నా కన్నీళ్లు తుడవడం జీవితంలో మర్చిపోలేని క్షణం నాకు. నేను గీసిన ఆయన డ్రాయింగ్ చూసి థాంక్యూ.. ఇది నేను తీసుకెళ్తాను అని చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. మీరు చాలా బాగున్నారని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ వెల కట్టలేనిది’ అంటూ లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలను షేర్ చేసింది. ధోనీ ఫ్యాన్ మూమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.