వెస్టిండీస్ తో సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కోహ్లీ ఒక అరుదైన ఫీట్ నమోదు చేసాడు.
క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సచిన్ వారసుడిగా రికార్డులు బద్దలు కొడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా లెక్కకు మించిన రికార్డులు కోహ్లీ సొంతం. అంతేకాదు భవిష్యత్తులో సచిన్ రికార్డులు బద్దలు కొట్టడం.. క్రికెట్ లో సగం రికార్డులు తన పేరు మీద లిఖించుకోవడం విరాట్ కి పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఆటతో పాటు ఫిట్ నెస్ కి ప్రాధాన్యమిచ్చే కోహ్లీ సమీప భవిష్యత్తులో తిరుగులేని క్రికెటర్ గా అవతరించడం గ్యారంటీ. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెస్టిండీస్ తో సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గెలుపు భారత్ కంటే విరాట్ కోహ్లీని ఒక అరుదైన జాబితాలోకి చేర్చింది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్లు గెలిచిన రెండో ప్లేయర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీని దాటేసి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ధోనీ 295 విజయాలతో రెండో స్థానంలో కొనసాగగా.. తాజాగా ఆ రికార్డుని విరాట్ కోహ్లీ(296) అధిగమించేసాడు. మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్ట్ లో 307 విజయాలతో ప్రధమ స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం 296 విజయాలతో రెండో స్థానానికి చేరుకున్న విరాట్ కోహ్లీ.. మరో 12 విజయాలు పూర్తి చేస్తే సచిన్ రికార్డ్ కూడా బ్రేక్ అవుతుంది. భవిష్యత్తులో ఈ రికార్డ్ కోహ్లీ పేరిట ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఇక విండీస్ జరిగిన తొలి టెస్టులో 76 పరుగులతో రాణించాడు. మరో 24 పరుగులు చేస్తే 76 సెంచరీ నమోదు చేసుకునే అవకాశం ఉన్న విరాట్ 76 పరుగులు వద్దనే ఔట్ కావడం విశేషం. ఇక విండీస్ తో జరగనున్న రెండో టెస్టు కోహ్లీ కెరీర్ లో 500 మ్యాచ్ ఆడనున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య 20 న రెండో టెస్టు జరుగుతుంది. మరి కోహ్లీ.. ఈ అరుదైన ఫీట్ నమోదు చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.