కన్న కొడుకు ప్రయోజకుడు అయ్యి.. ఉన్నత స్థానంలో ఉంటే.. అంతకు మించి ఓ తల్లికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. పైగా తన కొడుకు దేశం గర్వించే స్థాయికి ఎదిగితే ఆ తల్లికి అంతకన్నా పుత్రోత్సాహాం మరోటి ఉండదు. ప్రస్తుతం అలాంటి పుత్రోత్సాహాన్నే పొందుతోంది మహ్మద్ సిరాజ్ తల్లి. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్. ఇక తన కొడుకు ఆటను చూసి మురిసిపోయింది సిరాజ్ తల్లి. కొడుకు వికెట్లు తీస్తుంటే.. కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొడుతూ.. తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇండియా-కివీస్ మ్యాచ్ లో అందరు శుభ్ మన్ గిల్, బ్రేస్ వెల్ బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ మ్యాచ్ లో వారి ఆటకు మించిన ఓ భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉన్నాయి. దేశానికి ప్రాతినిధ్య వహిస్తున్న కొడుకును చూసి ఓ తల్లి మురిసిపోయిన సంఘటన అది. తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. తొలి సారి తన హోం గ్రౌండ్ లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ ఆటను చూడటానికి సిరాజ్ తల్లితో పాటుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వచ్చారు. హోం గ్రౌండ్ లో కొడుకు ఆటను చూస్తున్న ఆ తల్లి కళ్లలో ఆనందాన్ని మనం వీడియోలో చూడొచ్చు. సిరాజ్ వికెట్ తీసిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ.. ఇండియా.. ఇండియా.. అని అరుస్తూ.. ఎంతో ఉత్సాహాన్ని చూపించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..”ఆ అల్లా దయవల్ల నా కొడుకు అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు భవిష్యత్ లో కూడా ఇలాగే రాణిస్తాడని నేను అనుకుంటున్నాను. వరల్డ్ కప్ లో సైతం మంచిగా ఆడతాడు. ఇక నా కొడుకు దేశానికి ఆడటం మేం గర్వంగా భావిస్తున్నాం” అని సిరాజ్ తల్లి చెప్పుకొచ్చింది. ఆమెతో పాటుగా సిరాజ్ కుటుంబ సభ్యులు కూడా మ్యాచ్ చూస్తూ.. ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచో లో సిరాజ్ 10 ఓవర్లు వేసి 2 మెయిడెన్ లతో 46 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్టు పడగొట్టాడు.
A perfect and eventful day for @mdsirajofficial, who played his first international game at his home ground and had his family watching him sparkle for #TeamIndia with the ball 👏🏾👏🏾
Watch as his friends and family share their thoughts 🤗 #INDvNZ pic.twitter.com/AXPVWbxs9z
— BCCI (@BCCI) January 18, 2023