టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్లో కొనసాగుతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవుతోంది. దీంతో అతని ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ ఫామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయిన సందర్భంగా విరాట్ కోహ్లీ సెంచరీపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వాఖ్యలు చేశాడు.
మైండ్లో రకరకాల ఆలోచనలు మొదులుతున్నప్పుడు మనస్సుకు, శరీరానికి సమన్వయం లోపిస్తుందని దాంతో ఆటగాళ్లు సరిగ్గా ఆడలేరు అని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప ఆటగాడైన విఫలం అవ్వడం సహజం.. కోహ్లీ విషయంలో కూడా ఇదే జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ ఎక్కువగా వైడ్ ఆఫ్సైడ్ బంతుల్ని ఆడి అవుట్ అవుతుంటాడు. అయినా కూడా అవే షాట్లను తరచూ ఆడుతున్నాడంటే అతను మానసిక సమస్యతో బాధపడుతున్నాడని అర్థం అవుతోంది.
నిజానికి విరాట్కు అహం ఎక్కువగా.. ఎక్కడైన తాను ఆధిపత్యం చెలాయించాలని చూస్తాడని, దాంతో ఆట పక్కదారి పట్టి అతనిపై ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్ను తిరిగి అందుకోవాలంటే ఈ ఒత్తిడిని అధిగమించాలని పేర్కొన్నాడు. కాగా తన కెరీర్లో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు మిస్బా వెల్లడించాడు. కాగా మిస్బా వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“No matter how great you are, that automation gets affected”
Former Pakistan captain Misbah-ul-Haq explains the reason behind @imVkohli‘s extended lean patch with the bat https://t.co/SYwFZNUgHc
— Firstpost Sports (@FirstpostSports) July 1, 2022