ఇండియన్ క్రికెట్ లో నార్త్ పెత్తనం తగ్గిందా? సౌథర్న్ రాష్ట్రాల చేతుల్లోకి వచ్చినట్టేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికైన నాటి నుంచి సమీకరణాలు మారినట్లుగా వార్తలొస్తున్నాయి. మొన్నటివరకు దక్షిణాది క్రికేటర్లు అంటే చిన్నచూపు చూసిన బీసీసీఐ, నేడు వారికే పట్టం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం వచ్చింది. తాజాగా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్లే అందుకు సాక్ష్యం.
ఇండియన్ క్రికెట్ లో నార్త్ పెత్తనం సాగిందా? అనడానికి అంబటి రాయుడు క్రికెట్ ప్రయాణమే అతి పెద్ద ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన రాయుడు.. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రతిభ కనబర్చడంతో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడే అవకాశం వచ్చింది. ఆపై వెనుతిరిగి చూడని రాయుడు, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే జాతీయ జట్టు తరుపున వన్డే, టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఐసీసీ టోర్నీల్లో అతడికి పెద్దగా అవకాశాలే ఇవ్వలేదు. విజయ శంకర్ లాంటి త్రీడీ ప్లేయర్ అవసరమవుందుంటూ సాకును చూపి అప్పటి నార్తర్న్ రాష్ట్రాలకు చెందిన బీసీసీఐ సెలెక్టర్లు పని కట్టుకొని అలా చేశారు. ఈ కోపంతో రాయుడు క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఒక్క ఉదాహరణే కాకపోయినా ఇండియన్ క్రికెట్ లో నార్త్ పెత్తనం సాగిందనడానికి బోలెడు సాక్ష్యాలున్నాయి.
Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
— Ambati Rayudu (@RayuduAmbati) April 16, 2019
అయితే కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి సెలెక్టర్లలో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. సెలక్షన్ ప్యానల్ లో దక్షణాధి రాష్ట్రాల నుంచి అభయ్ కురువిల్లా ఎప్పటి నుంచో పనిచేస్తున్నా అతనిలో పెద్దగా చలనం ఉండేది కాదు. కాదని ఎదురుచెప్పినా వారి ముందు సాగేది కాదు. అందుకే మిన్నకుండిపోయాడు. అయితే ఇటీవల బిన్నీ అధ్యుక్షుడిగా ఎన్నికయ్యాక సమీకరణాలు పూర్తిగా మారాయి. నైపుణ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాల క్రికెటర్లకు అవకాశాలు వచ్చేలానే కనిపిస్తున్నాయి. తాజాగా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్లే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
సంజూ శాంసన్(కేరళ), వాషింగ్టన్ సుందర్(కర్ణాటక), కె ఎస్ భరత్(ఆంధ్రప్రదేశ్), మహమ్మద్ సిరాజ్(హైదరాబాద్).. ఇలా అందరకి ఒకేసారి జట్టులో చోటు లభించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత బీసీసీఐని పరిలశీలిస్తే.. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ(కర్ణాటక), సెలక్షన్ ప్యానల్ సభ్యుడిగా అభయ్ కురువిల్లా(మన్నార్, కేరళ), ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్(కర్ణాటక), వైస్ కెప్టెన్- కే ఎల్ రాహుల్(కర్ణాటక), విరాట్ కోహ్లీ(కర్ణాటక) సహా తాజాగా చోటు దక్కించుకున్న నలుగురిని కలిపితే పెద్ద లిస్టే ఉంది. దీంతో బీసీసీఐ పెత్తనం దక్షిణాది రాష్ట్రాల చేతుల్లోకి వచ్చినట్లు చెప్పకనే చెబుతోంది.
The new office bearers of BCCI. pic.twitter.com/owBZXPEmW9
— Johns. (@CricCrazyJohns) October 18, 2022