ప్రస్తుతం టీమిండియా విండీస్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్ తో టీ 20 లు ఆడాల్సి ఉంది. ఈ జట్టుకి మాజీ తెలుగు క్రికెటర్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వెళ్లనున్నట్లు సమాచారం.
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ లో ఉంది. షెడ్యూల్ లో భాగంగా రెండు టెస్టులతో పాటు, మూడు వన్డేలు, 5 టీ 20 లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతుండగా ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాల్సి ఉంది. విండీస్ జరగనున్న చివరి రెండు వన్డేలు యూఎస్ఏ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్ తో సిరీస్ కోసం టీమిండియా వారి దేశానికి వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సిరీస్ లో సీనియర్లతో పాటుగా హెడ్ కోచ్ ద్రవిడ్ కి కూడా రెస్ట్ ఇస్తున్నట్లుగా బీసీసీఐ భావిస్తోందట. దీంతో ఐర్లాండ్ సిరీస్ కి భారత క్రికెట్ జట్టుకి మాజీ తెలుగు క్రికెటర్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు.
గత కొంతకాలంగా తీరిక షెడ్యూల్ తో బిజీ అయిపోయిన రాహుల్ ద్రవిడ్ కి రెస్ట్ దొరకనుంది. ద్రవిడ్ తో సహాయక సిబ్బంది గా ఉంటున్న బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాబ్రేతో పాటు మరో కొంతమంది సభ్యులున్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ని దృష్టిలో ఉంచుకొని వీరందరికి రెస్ట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా వీరు భారత్ జట్టుతోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సిరీస్ లకి సీనియర్ క్రికేటర్లకి మరి కొన్ని సిరీస్ లో యంగ్ ప్లేయర్లకు రెస్ట్ దొరుకుతున్నా.. ద్రవిడ్ సిబ్బందికి మాత్రం రెస్ట్ లభించడం లేదు. ఇక ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఐర్లాండ్ కి వెళ్లనున్నాడు. లక్ష్మణ్ టీంలో బ్యాటింగ్ కోచ్ గా హృతికేష్ కనిత్కర్, బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. గతంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ కోచ్ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ద్రవిడ్ కి కాస్త రెస్ట్ దొరకడం, లక్ష్మణ్ హెడ్ కోచ్ మారడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.