క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లు చేసే తప్పులకు ఆ జట్టు కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా పాకిస్థాన్ మ్యాచ్ లో ఈ విషయం టీమిండియాకు తెలిసొచ్చింది. కానీ ఈ సారి అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల భారత్ మరో సారి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇప్పటికే ఆసియా కప్ లో శ్రీలంక-ఆఫ్గాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో తప్పుడు నిర్ణయం తీసుకోవడంపై అంపైర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన మరవక ముందే మరో సారి అంపైర్లు భారత అభిమానుల ఆగ్రహానికి గురైయ్యారు. దానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్ అవుట్ అయిన విధానమే. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది టీమిండియా. దాంతో తర్వాత శ్రీలంకతో మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే అంపైర్ల తప్పుడు నిర్ణయానికి టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బలైయ్యాడు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో షాక్ కు గురైన రాహులు మైదానంలోనే అంపైర్ ను తిట్టాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది అంటే? దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ స్లోగా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఇక రెండో ఓవర్ వేసేందుకు లంక బౌలర్ మహేష్ తీక్షణ వచ్చాడు. తీక్షణ వేసిన 5వ బంతిని రాహుల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
బంతి గమనాన్ని అంచనావేయలేక పోయాడు రాహుల్. దాంతో బాల్ వచ్చి రాహుల్ బూట్ కు తాకింది. దాంతో లంక ప్లేయర్స్ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. వెంటనే అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం చాలా కాన్పిడెంట్ గా రివ్యూకు వెళ్లాడు. చాలా తీక్షణంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించి ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పాడు. దాంతో అసహనానికి గురైన రాహుల్ అంపైర్ ను తిడుతూనే మైదానం వీడాడు. తర్వాత బంతి బ్యాట్ కు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు అంపైర్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ..” ఇది క్రికెట్ కు మరో మాయని మచ్చ అనగా.. బ్యాడ్ లక్ రాహుల్ భాయ్ అంటూ మరోకరు పేర్కొన్నారు. మరి అంపైర్ తప్పుడు నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.