టీమిండియా వెటరన్ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రంజీ సీజన్ 2022-23లో మహారాష్ట్ర-అస్సాం మధ్య జరుతున్న మ్యాచ్లో జాదవ్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సులతో 283 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. అస్సాంను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్లో అస్సాం 274 పరుగులకు ఆలౌట్ అయింది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 594 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలుత ఓపెనర్ సిద్ధేష్ వీర్ 106 పరుగులతో రాణించాడు.
ఆ తర్వాత కేదార్ జాదవ్ పరుగుల వరద పారించాడు. 283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సులతో 283 పరుగులు చేసి.. చివరికి రియాన్ పరాగ్ బౌలింగ్లో శుభమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే.. తృటిలో ట్రిపుల్ సెంచరీని కోల్పోయాడు. ఇక 2014లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్ ఇప్పటి వరకు 73 వన్డేలు ఆడి.. 1389 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున 9 టీ20లు ఆడిన కేదార్ 122 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం ఫామ్ కోల్పోయిన జాదవ్.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన కేదార్.. 2018 నుంచి 2020 వరకు చెన్నైలోనే కొనసాగి మంచి ప్రదర్శన కనబర్చాడు. కేదార్కు చెన్నై ఏకంగా రూ.7.80 కోట్ల ధర చెల్లించింది. 2020 దారుణ ప్రదర్శన తర్వాత చెన్నై జాదవ్ను వదిలేసింది. ఐపీఎల్ 2021కి సన్రైజర్స్ హైదరాబాద్ రూ.2 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ 2022కు మాత్రం జాదవ్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. 2010 నుంచి ఐపీఎల్ ఆడుతున్న జాదవ్.. మొత్తం 93 మ్యాచ్లు ఆడాడు. అందులో 1196 పరుగులు సాధించాడు.
Kedar Jadhav scored 283 from just 283 balls against Assam in his comeback First-Class match for Maharashtra after a long gap of three years.
Simply incredible from Kedar!#CricTracker #KedarJadhav #RanjiTrophy pic.twitter.com/ZYInRWwj4a
— CricTracker (@Cricketracker) January 5, 2023