స్వదేశంలో మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల గాయాలు టీమిండియాని వేధిస్తున్నాయి. వీటిపై తాజాగా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ స్పందిస్తూ టీమిండియా ఆటగాళ్లపై మండిపడ్డారు.
భారత్ వేదికగా మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో ఈ మెగా ఈవెంట్ జరగడంతో ఇప్పుడు టీమిండియా మీద భారీ అంచనాలే ఉన్నాయి. క్రికెట్ చరిత్రలో తొలిసారి భారత్ వరల్డ్ కప్ కి పూర్తిస్థాయిలో ఆతిధ్యమివ్వడం విశేషం. అయితే ఈ వరల్డ్ కప్ లో టీమిండియాని టైటిల్ ఫేవరేట్ గా భావించలేని పరిస్థితి. కీలక ఆటగాళ్ల గాయాలు, వెస్టిండీస్ పర్యటనలో ప్రయోగాలు వికటించడం, ఫామ్ లో ఎవరున్నారో అర్ధం కాకపోవడం ఇవన్నీ టీమిండియాకు తలనొప్పిగా మారాయి. ఇదంతా పక్కనపెడితే..వరల్డ్ కప్ నెగ్గాలంటే ప్రస్తుతం గాయాల బారిన పడిన స్టార్ ఆటగాళ్లు కోలుకోవడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది.వీరి గాయాల మీద ఎలాంటి స్పష్టత రాకపోవడంతో భారత లెజెండ్ కపిల్ దేవ్ ఇండియన్ ప్లేయర్లకు దేశం కంటే ఐపీఎల్ ముఖ్యమని మండిపడ్డాడు.
జస్ప్రీత్ బూమ్రా, కె యల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఈ నలుగురు ప్లేయర్లు టీమిండియాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా బౌలింగ్ దళాన్ని నడిపించినందుకు బూమ్రా, మిడిల్ ఆర్డర్ లో సమర్ధవంతంగా బ్యాటింగ్ చేయగల శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్లుగా రాహుల్, పంత్ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మిడిల్ ఆర్డర్ సమస్యలు జట్టుని వేధిస్తుండగా.. కోచ్ రాహుల్ ద్రావిడ్ నిర్ణయాలు కూడా పెద్దగా సత్ఫాలితాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ మాట్లాడుతూ “భారత ఆటగాళ్లు చిన్న గాయాలున్నా ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఇలాంటి చిన్న గాయాలు ఉన్నప్పుడు దేశం తరపున ఆడినందుకు నిరాకరిస్తున్నారు. అందరికీ ఐపీఎల్ ముఖ్యమైనా.. అది ఇండియన్ క్రికెట్ ని నాశనం చేస్తుంది”.అని ఈ లెజండరీ చెప్పుకొచ్చాడు.
ఫాస్ట్ బౌలర్ ఫిట్ గా ఉన్నాడని.. ఐర్లాండ్ సిరీస్ లో అడాతాడని బీసీసీఐ చెప్పుకొచ్చినా.. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పంత్, రాహుల్, లాయర్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. మరి వీరి గాయాల ఉంచి కోలుకొని ఆసియా కప్ కి సెలక్ట్ అవుతారా ? లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి మ్యాచ్ లో గెలిచి రెండో వన్డేలో ఓడిపోయింది. సిరీస్ నిర్ణయించే చివరి వన్డే రేపు జరగనుంది. అనవసర ప్రయోగాలకు పోయి రెండో వన్డే చేజార్చుకున్న టీమిండియా మూడో వన్డేలో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. మరి కపిల్ దేవ్ చేసిన ఇండియన్ ప్లేయర్లపై చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.