భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్లో భాగంగా చివరి టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. చివరి టెస్టులో విజయం సాధించి ఎలాగైన సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు గట్టిగానే ప్రయత్నిస్తాయి. ఇప్పటికే ఆటగాళ్లు ప్రాక్టీస్లో ముగిపోయారు. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు కేప్ టౌన్ చేరుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కేప్ టౌన్ మైదానంతో తనకున్న అనుబంధాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు.
Cape Town, January 2018 – is where it all began for me in Test cricket. Four years on, I’ve grown as a player and a person and to return to this ground brings back special memories. 😊 pic.twitter.com/pxRPNnqwBH
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 9, 2022
ఇదే గ్రౌండ్లో 2018లో తన టెస్టు కెరీర్ మొదలుపెట్టినట్లు.. నాలుగేళ్ల తర్వాత ఆటగాడిగా, ఒక మనిషిగా ఎదిగి మళ్లీ ఇక్కడ టెస్ట్ ఆడేందుకు రావడం చాలా సంతోషంగా ఉందని బుమ్రా అన్నారు. కాగా బుమ్రా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. బుమ్రా మూడో టెస్టులో సామర్థ్యం మేర రాణిస్తే.. దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పవు. బుమ్రా మొదటి టెస్టులో 5 వికెట్లు, రెండో టెస్టులో ఒక వికెట్ పడగొట్టాడు. మరి బుమ్రాకు కేప్ టౌన్ గ్రౌండ్తో ఉన్న అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా బౌలర్ కవ్వింపు.. కోపంతో ఊగిపోయిన బుమ్రా