నెదర్లాండ్స్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో 50 ఓవర్లలో 498 పరుగులు చేసి క్రికెట్ హిస్టరీలోనే అతి గొప్ప రికార్డు సృష్టించారు. తొలి వన్డేలో ఫెయిల్ అయిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్.. రెండో వన్డేలో మాత్రం ఆకట్టుకున్నాడు. కేవలం 60 బంతుల్లోనే 73 పరుగులు చేసిన రాయ్.. ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల తీసుకున్న గ్యాప్తో ఇటు కుటంబంతో సమయాన్ని కూడా ఆనందంగా గడిపాడు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ కు సంబంధించి మాత్రం జేసన్ రాయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘పాకిస్తాన్ సూపర్ లీగ్ లో నేను మానసికంగా ఏమాత్రం బాగాలేను. ఒక విచిత్రమైన ప్రదేశంలో ఉన్నాననే భావన కలిగింది. నేను క్రికెట్ బాగానే ఆడుతున్నాను. కానీ, క్రికెట్ను మాత్రం ఆశ్వాదించలేకపోయాను. అవన్నీ నాకు చీకటి రోజులనే చెప్తాను. పీఎస్ఎల్ తర్వాత రెండు నెలలపాటు ఇంట్లో కుటుంబంతో ఆనందంగా గడిపాను. రెండేళ్లపాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన నాకు.. మానసికంగా, శారీరకంగా సరైన విరామం, విశ్రాంతి దొరికాయి. పీఎస్ఎల్ కోసం 50 రోజులు హోటల్ క్వారంటైన్లో ఉన్నాను. జనవరి నెలలో నాకు బిడ్డ పుట్టినా కూడా నేను దూరంగా ఉండాల్సిన పరిస్థితి అది. ఆ పరిస్థితులు నన్ను మానసికంగా ఎంతో క్షోభకు గురిచేశాయి.’
‘నేను కుటుంబంతో కొంత సమయాన్ని గడపాలి అనుకున్నాను. అందుకే నేను ఐపీఎల్-2022లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా ఫ్యామిలీతో గడపడం ద్వారా నేను చాలా విషయాల్లో రిలాక్స్ అయ్యాను. మళ్లీ సరికొత్తగా ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడుతున్న భావన కలుగుతోంది. ఇంతకముందు టీ20 బ్లాస్ట్ లో బాగా రాణించాను. అక్కడ సర్రే తరఫున ఆడుతున్న ప్రతి క్షణాన్ని నేను ఆశ్వాదించగలిగాను.’ అంటూ జేసన్ రాయ్ తన మనసులోని మాటలను తన అభిమానులతో పంచుకున్నాడు.
“Over 50 days of hotel quarantine the year before and then having a child in January and having to spend time away from him was just a bit too much.”
– Jason Roy admits that despite his great performance in PSL 2022, he did not enjoy it much. #Pakistan | #PSL | #Cricket pic.twitter.com/L9ozfDIVzK
— Green Team (@GreenTeam1992) June 21, 2022
పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 లో జేసన్ రాయ్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడాడు. మొత్తం ఆరు ఇన్నింగ్స్ లో 170 స్ట్రైక్ రేట్, 50.50 సగటుతో 303 పరుగులు చేశాడు. పీఎస్ఎల్ 2022 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో జేసన్ రాయ్ కూడా ఒకడు. ఇంక ఐపీఎల్ విషయానికి వస్తే.. మెగా వేలంలో జేసన్ రాయ్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కానీ, బయోబబుల్ రూల్స్ వల్ల సిరీస్ కి ముందే నేను ఆడలేనంటూ రాయ్ తప్పుకున్నాడు. పీఎస్ఎల్పై జేసన్ రాయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jason Roy on PSL#PSL #Pakistan #Pakistansuperleague pic.twitter.com/suUXVbkHav
— CricHub (@CricHubOfc) June 20, 2022