టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అంతేకాకుండా త్వరలోనే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుండగా ప్లేయర్లంతా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో చమటోస్తున్నారు. కొందరు మాత్రం గాయాలతో సతమతమవుతుంటే.. అవకాశం ఉన్నవాళ్లు మాత్రం తమని నిరూపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అయితే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న కొద్దీ.. టీమిండియా జట్టుపై ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. మా డ్రీమ్ టీమ్ అంటూ చాలా మంది కొందరు ప్లేయర్లను పిక్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా.. వారి టీమ్స్ ను అనౌన్స్ చేస్తున్నారు. పలానా వాళ్లు జట్టులో ఉంటారు.. ఆ ప్లేయర్ కు అసలు అవకాశం దక్కదు అంటూ మాజీ ప్లేయర్ల మొదలు, నిపుణులు, విదేశీ ఆటగాళ్లు సైతం తమ ప్రిడిక్షన్స్, కాలుక్యులేషన్స్ చెబుతున్నారు. అయితే ఎవరు ఎన్ని అనుకున్న సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం అవుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ప్రస్తుతం అభిమానులు అంతా ఆ మూడ్ లో ఉన్నారు కాబట్టి అంతా జట్టు గురించే మాట్లాడుతున్నారు. అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టుకు సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. సౌరవ్ గంగూలీ అధ్యక్షుడు అయ్యాక.. పక్కా ప్లాన్ తోనే ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా తెచ్చుకున్నాడని అందరికీ తెలుసు. అంతే కాకుండా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కు గంగూలీ ఫుల్ పవర్స్ ఇచ్చాడు అని కూడా తెలిసిన విషయమే. అయితే ఆ వాదనలకు బలం చేకూర్చేలా తాజాగా గంగూలీ స్పందించాడు. ‘ఇంగ్లాండ్ టూర్ నుంచి రాహుల్ ద్రావిడ్ ఎవరైతే టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నారో.. ఆ ఆటగాళ్లతో రాహుల్ ద్రవిడ్ ఆడుకోవడం మొదలు పెడతాడు.’ అంటూ కామెంట్ చేశాడు. అంటే ఎవరు వెళ్లాలో.. ఎవరిని ఎంపిక చేయాలో అంతా ద్రవిడ్ ఇష్టం అనేలా గంగూలీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీ20 ప్రపంచకప్ జట్టులో ఎవరు ఉంటే బావుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ️BCCI president Sourav Ganguly gives a hint on India's probable team for T20 World Cup 2022 in Australia. pic.twitter.com/XLcDUnEzoA — CricTracker (@Cricketracker) June 18, 2022 ఇదీ చదవండి: ఆ టీమిండియా స్టార్ ప్లేయర్కు టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కదు: ఆశిష్ నెహ్రా ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్.. టీమిండియాలోనే తొలి పేసర్గా!